ETV Bharat / bharat

కర్ణాటకలో భూప్రకంపనలు.. భయంతో వీధుల్లోకి జనం పరుగులు

author img

By

Published : Jun 25, 2022, 4:27 PM IST

Tremors felt in Karnataka
దెబ్బతిన్న ఇళ్లు

Tremors felt in Karnataka: కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. భారీ శబ్దాలతో భూమి కంపించడం వల్ల అనేక ప్రాంతాల్లో ఇళ్లు బీటలువారాయి.

Tremors felt in Karnataka: కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. సుళ్యా తాలుకాలో ఉదయం 9:10 నిమిషాలకు భారీ శబ్దాలతో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. సుమారు 45 సెకన్ల పాటు కంపించినట్లు చెప్పారు. సుళ్యా సహా కల్లుగుండి, సంపాజే, గూండ్కా, అరంతోడు, ఇవర్నాడు, తోడిక్కన ప్రాంతాల్లో ప్రకపంనలు సంభవించాయి.

Tremors felt in Karnataka
పగుళ్లు వచ్చిన గోడలు
Tremors felt in Karnataka
దెబ్బతిన్న ఇళ్లు

రిక్టర్​ స్కేల్​పై 2.4 తీవ్రత నమోదైనట్లు విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. సుళ్యా ప్రాంతాల్లోని అనేక ఇళ్లు బీటలువారాయి. ఆందోళన చెందిన ప్రజలు.. ఇళ్లు వదిలి వీధుల్లోకి పరుగెత్తారు. ప్రకంపనల ధాటికి ఇళ్లలోని వస్తువులన్నీ నేలపై పడిపోయాయి. ఈ ఘటనపై ప్రజలు తమకు సమాచారం అందించారని దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్​ కేవీ రాజేంద్ర తెలిపారు.

ఇదీ చదవండి: ప్రయాణిస్తుండగానే బైక్​లో చెలరేగిన మంటలు.. రైడర్​ సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.