ETV Bharat / bharat

కిలాడీ కపుల్- ఫేస్​బుక్​లో ఎరవేసి.. 11 లక్షల వసూలు చేసి..

author img

By

Published : Sep 23, 2021, 9:17 PM IST

face book love
ఫేస్​బుక్ ప్రేమ

ఫేస్​బుక్​లో​ పరిచయమైన ఓ యువకుడిని దారుణంగా మోసం చేసింది ఓ వివాహిత. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి రూ. 11 లక్షల వరకు వసూలు చేసింది. ఈ ప్రక్రియలో ఆ మహిళకు సొంత భర్తే తోడ్పడటం గమనార్హం.

ఫేస్​బుక్​లో పరిచయం చేసుకొని, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఓ యువకుడికి దగ్గరైంది కేరళ మహిళ. అప్పటికే తనకు వివాహం అయిందన్న విషయం దాచి.. యువకుడి నుంచి దాదాపు రూ. 11 లక్షల వరకు వసూలు చేసింది. ఈ ప్రక్రియలో సొంత భర్తే ఆ మహిళకు తోడయ్యాడు.

అసలేం జరిగిందంటే..

పార్వతి(31) అనే మహిళకు పండలమ్​కు చెందిన మహేశ్​ కుమార్​కు 2020 ఏప్రిల్​లో ఫేస్​బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. మహేశ్​ నరియాపురమ్​లోని ఆటోమొబైల్​లో షాపులో పనిచేస్తుండేవాడు. అయితే, మహేశ్​కు తాను ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నట్లు పార్వతి చెప్పింది. ఎస్​ఎన్​ పురంలో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు పేర్కొంది. క్రమంగా ప్రేమిస్తున్నానని నమ్మించి మహేశ్​ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం మొదలు పెట్టింది పార్వతి.

పెళ్లి చేసుకుంటానని చెప్పి మొత్తంగా రూ. 11 లక్షల వరకు వసూలు చేసింది పార్వతి. మహేశ్​ను నమ్మించేందుకు ఎర్నాకులంలోని తన బంధువుల ఇంటికి కూడా తీసుకెళ్లింది. కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని చెప్పింది. అనుమానంతో మహేశ్​.. పార్వతి బంధువుల ఇంటికి వెళ్లి అసలు విషయం తెలుసుకున్నాడు. పెళ్లైన విషయం దాచి డబ్బుల కోసం ఇలా చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మహేశ్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. పార్వతి భర్త సునీల్ లాల్​(43) కూడా ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించాడని తెలుసుకున్నారు. అనంతరం ఇరువురినీ అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

పోలీసులు అరెస్టు చేస్తారని తుపాకీతో కాల్చుకున్న నిందితుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.