ETV Bharat / bharat

భోజనం పెట్టలేదని భార్యను చంపిన భర్త.. రాత్రంతా శవంతోనే..

author img

By

Published : Jun 18, 2022, 10:50 PM IST

delhi wife murder
భార్యను హత్య చేసిన భర్త

భోజనం పెట్టలేదని సొంత భార్యనే హత్య చేశాడు ఓ భర్త. మద్యం మత్తులో ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన దిల్లీలో జరిగింది. నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

మద్యం మత్తులో జరిగిన గొడవ వల్ల సొంత భార్యనే హత్యచేశాడు ఓ భర్త. భార్య మరణించిందని తెలియక రాత్రంతా శవం పక్కనే పడుకున్నాడు. ఉదయం లేచి చూసేసరికి భార్య మరణించిదని తెలిసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటన దిల్లీలో జరిగింది. సుల్తాన్​పుర్​కు చెందిన వినోద్​ కుమార్​ దూబే(47)ను నిందితుడిగా గుర్తించారు పోలీసులు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: వినోద్​ కుమార్​, సోనాలికి 2008లోనే వివాహం జరిగింది. గురువారం రాత్రి వీరిద్దరు కలిసి మద్యం సేవించారు. అనంతరం వినోద్ కుమార్.. సోనాలిని భోజనం వడ్డించమని అడగగా.. ఆమె అందుకు నిరాకరించింది. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న సోనాలి.. వినోద్​ కుమార్ చెంపపై కొట్టింది. ఆవేశంతో వినోద్​.. సోనాలిని కొట్టాడు. అనంతరం దిండుతో ఊపిరాడకుండా చేశాడు. అప్పుడు అక్కడికక్కడే సోనాలి మృతి చెందింది. ఇది తెలియని నిందితుడు వినోద్​.. రాత్రంతా ఆమె పక్కనే పడుకున్నాడు. శుక్రవారం ఉదయం చూసేసరికి భార్య మరణించిందని తెలుసుకుని రూ.40,000 నగదుతో దిల్లీ నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అంతలోనే పోలీసులు అరెస్టు చేశారు.

శుక్రవారం ఉదయం వినోద్​ కుమార్​ తన భార్యతో గొడవపడి తలగడతో ఊపిరాడకుండా చేశాడని పోలీసులకు ఓ వ్యక్తి ఫోన్​లో సమాచారం అందించాడు. నిందితుడు వినోద్​ కుమార్ వద్ద నుంచి రూ. 43,280 నగదు, రెండు మద్యం సీసాలు, రక్తపు మరకలున్న దిండును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి: గన్​తో బెదిరించి రూ.50 లక్షలు చోరీ.. సీసీటీవీ వీడియో వైరల్

పరువు హత్య కలకలం.. సొంత చెల్లిని కత్తులతో పొడిచి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.