ETV Bharat / bharat

Lakhimpur Incident: కేంద్ర మంత్రి డ్రైవర్​ కుటుంబానికి రూ.45లక్షలు

author img

By

Published : Oct 9, 2021, 11:07 AM IST

lakhimpur kheri incident
కేంద్ర మంత్రి డ్రైవర్​ కుటుంబానికి రూ.45లక్షలు

లఖింపుర్​ ఖేరి హింసాత్మక ఘటనలో(lakhimpur kheri incident) ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు భాజపా కార్యకర్తలు(bjp lakhimpur kheri) సహా కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా కారు డ్రైవర్​ల కుటుంబాలకు రూ.45లక్షల చొప్పున పరిహారం అందించింది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. రెండు రోజుల క్రితమే బాధిత రైతు కుటుంబాలకు పరిహారం అందించగా.. భాజపా సభ్యులకు సైతం చెక్కులు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఉత్తర్​ప్రదేశ్​లోని లఖింపుర్​ ఖేరి హింసాత్మక ఘటనలో(lakhimpur kheri incident ) మృతి చెందిన ఇద్దరు భాజపా కార్యకర్తలు(bjp lakhimpur kheri), కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా డ్రైవర్​ కుటుంబాలకు రూ.45 లక్షల చొప్పున పరిహారం అందించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ ముగ్గురిలో ఇద్దరు సంఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

అక్టోబర్​ 3వ తేదీన లఖింపుర్​ ఖేరిలో చెలరేగిన ఘర్షణలో మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో నలుగురు రైతులు, ఓ పాత్రికేయుడు, ఇద్దరు భాజపా సభ్యులు, కారు డ్రైవర్​ ఉన్నారు. ఇప్పటికే.. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతులు, జర్నలిస్ట్​ కుటుంబాలకు రూ.45 లక్షల చొప్పున పరిహారం అందించింది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం.

చెక్కులు అందించిన స్థానిక ఎమ్మెల్యే..

భాజపా సభ్యుడు శుభమ్​ మిశ్రా, కేంద్ర మంత్రి కారు డ్రైవర్​ హరిఓమ్​ మిశ్రాల కుటుంబ సభ్యులను తాజాగా కలిసి చెక్కులను అందించారు లఖింపుర్​ ఎమ్మెల్యే యోగేశ్​ వర్మ. మరోవైపు.. ప్రాణాలు కోల్పోయిన మరో భాజపా సభ్యుడు శ్యామ్​ సుందర్​ కుటుంబానికి స్థానిక తహసీల్దార్​ చెక్కును అందించారు.

ఇదీ చూడండి: Navjot Singh Sidhu News: లఖింపుర్ ఖేరిలో సిద్ధూ నిరాహార దీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.