కేరళలోని కాసరగోడ్లో విషాద ఘటన జరిగింది. తొలుత ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన రూగేశ్.. ఆ తర్వాత తాను కూడా నిర్మాణంలో ఉన్న ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కుటుంబ కలహాలే కారణమా?
రూగేశ్, సబితలు భార్యాభర్తలు. వీరు చెరువతూర్లో నివాసముంటున్నారు. వీరి మధ్య కొద్దికాలంగా తరచూ గొడవలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్యను వదిలేసి వేరుగా నివాసముంటున్నాడు రూగేశ్. వీరి పిల్లలు వైదేహి(10), శివానందన్(6) సబిత వద్దే ఉండేవారు. అయితే.. వారం క్రితం ఆ పిల్లలను తన వద్దకు తెచ్చుకున్నాడని సమాచారం.
ఈ పూర్తి వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: ఆశ్రమ పాఠశాలలో 30 మంది విద్యార్థులకు కరోనా