ETV Bharat / bharat

Viveka Murder Case: సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్​

author img

By

Published : Apr 19, 2023, 12:48 PM IST

MP Aviansh Attended to CBI Inquiry
MP Aviansh Attended to CBI Inquiry

MP Aviansh Attended to CBI Inquiry: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాష్​ రెడ్డి హాజరయ్యారు. న్యాయవాదితో కలిసి సీబీఐ విచారణకు అవినాష్​ వచ్చారు.

MP Aviansh Reddy Attended to CBI Inquiry: మాజీ మంత్రి వైఎస్​ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకుడు, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ముందు హాజరయ్యారు. ఐదోసారి ఆయన సీబీఐ విచారణకు వెళ్లారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి బయల్దేరి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి విచారణకు అవినాష్​ వెళ్లారు. ఈనెల 25 వరకు అవినాష్​ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు న్యాయవాదితో కలిసి సీబీఐ విచారణకు అవినాష్​ హాజరయ్యారు. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారించనుంది.

భాస్కర్​ రెడ్డి, ఉదయ్​ కుమార్​రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సీబీఐ అధికారులు: మరోవైపు వివేకా హత్య కేసులో నిందితులు వైఎస్​ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌ కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. వైఎస్‌ వివేకా హత్య కేసులో ఇద్దరిని ప్రశ్నించనున్నారు. ఈనెల 14న ఏ6 ఉదయ్‌కుమార్‌రెడ్డిని, ఈనెల 16న ఏ7 వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆరు రోజులపాటు సీబీఐ అధికారులు ఇద్దరినీ ప్రశ్నించనున్నారు. అవినాష్​ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌ను కలిపి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వివేకా హత్య కేసులో ఇప్పటివరకూ గుర్తించిన అంశాలతో పాటు హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారనే విషయాలపై వివరాలు సేకరించనుంది.

వివేకా హత్య కేసులో విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ పిటిషన్​పై విచారణ చేపట్టిన కోర్టు.. అవినాష్​ను ఈ నెల 25 వరకు అరెస్ట్‌ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. అయితే అప్పటి వరకు సీబీఐ కార్యాలయంలో ప్రతి రోజూ విచారణకు హాజరు కావాలనే షరతు విధించింది. రాతపూర్వకంగా అవినాష్‌కు ప్రశ్నలను ఇవ్వాలని.. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25న తుది ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.