ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా 77శాతానికి పెంపు

author img

By

Published : Nov 11, 2022, 6:01 PM IST

Updated : Nov 11, 2022, 7:53 PM IST

jharkhand-assembly-passes-bill-to-raise-reservations-to-77
jharkhand-assembly-passes-bill-to-raise-reservations-to-77

రిజర్వేషన్ల విషయంలో ఝార్ఖండ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లను 77 శాతానికి పెంచుతూ శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఓ బిల్లును ఆమోదింపచేసుకుంది.

ఝార్ఖండ్​లో రిజర్వేషన్లను 77 శాతానికి పెంచుతూ శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో ఓ బిల్లును ఆమోదించారు. 2001 నాటి రిజర్వేషన్​ చట్టాన్ని ఈమేరకు సవరించారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రస్తుతం ఉన్న 60 శాత రిజర్వేషన్‌లను మరో 17 శాతం పెంచారు. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు ఈ బిల్లులో పేర్కొన్నారు. అయితే ఈ మార్పును షెడ్యూల్‌లో చేర్చిన తర్వాత అమలులోకి వస్తుందని తెలిపారు.

ప్రస్తుతం ఝార్ఖండ్​లో ఎస్​టీలకు 26శాతం, ఎస్​సీలకు 10శాతం రిజర్వేషన్ ఉంది. ఓబీసీల కోటా 14శాతంగా ఉండగా.. పెంచుతామని 2019 ఎన్నికల సమయంలో అన్ని ప్రధాన పార్టీలు హామీ ఇచ్చాయి. ఇప్పుడు హేమంత్ సోరెన్​ తెచ్చిన బిల్లుతో ఎస్సీలకు 12 శాతం, ఎస్టీలకు 28 శాతం, ఈబీసీలకు 15 శాతం, ఓబీసీలకు 12 శాతం రిజర్వేషన్ ఉండనుంది.

ఝార్ఖండ్​ స్థానికుల నిర్వచన బిల్లు ఆమోదం..
ఇదే క్రమంలో మరో బిల్లును కూడా ఝార్ఖండ్​ శాసనసభ ఆమోదించింది. ప్రజల నివాస స్థితిని నిర్ణయించేందుకు 1932 భూ రికార్డులను ఉపయోగించాలని ప్రతిపాదించిన ఆ బిల్లును శుక్రవారం అసెంబ్లీలో ఆమోదించారు.

ఇదీ చదవండి:జడ్జిల నియామకంలో జాప్యం.. కేంద్రంపై సుప్రీంకోర్టు అసహనం

దీపావళికి రూ.21లక్షల బైక్ కొని ఊరేగించడం గుర్తుందా? పాపం ఇప్పుడా బండి బూడిదై..

Last Updated :Nov 11, 2022, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.