ETV Bharat / bharat

72 ఏళ్లకు పెరగనున్న సగటు ఆయుర్ధాయం

author img

By

Published : Apr 10, 2021, 5:46 AM IST

indians average life span to increase to 72 years
72 ఏళ్లకు పెరగనున్న సగటు ఆయుర్ధాయం

2014-18 మధ్య 69.6గా ఉన్న దేశ ప్రజల సగటు ఆయుర్ధాయం 2031నుంచి 2035 నాటికి 72 ఏళ్లకు చేరుకోనుందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ అంచనా వేసింది. గడిచిన పదేళ్లలో జనాభా పెరుగుదల రేటు 1.6 నుంచి 1.1కి తగ్గినట్లు తన నివేదికలో పేర్కొంది. దేశంలో లింగ నిష్పత్తి స్వల్పంగా పెరిగినట్లు వెల్లడించింది.

దేశ ప్రజల సగటు ఆయుర్ధాయం 2031నుంచి 2035 నాటికి 72 ఏళ్లకు చేరుకోనుందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ అంచనా వేసింది. సగటు ఆయుర్ధాయం మహిళల్లో అత్యధికంగా 76.66 ఏళ్లుగా ఉండనుందని అభిప్రాయపడింది. 2014-18 మధ్య దేశ ప్రజల సగటు ఆయుర్ధాయం 69.6 ఏళ్లుగా నమోదైంది.

మరోవైపు దేశ ప్రస్తుత జనాభా 136.1 కోట్లుగా అంచనా వేసిన కేంద్ర గణాంకశాఖ.. గడిచిన పదేళ్లలో జనాభా పెరుగుదల రేటు 1.6 నుంచి 1.1కి తగ్గినట్లు తన నివేదికలో పేర్కొంది. దేశంలో లింగ నిష్పత్తి స్వల్పంగా పెరిగినట్లు వెల్లడించింది. 2011లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 943మంది మహిళలుంటే, ప్రస్తుతం 948కి పెరిగినట్లు నివేదిక తెలిపింది.

వైద్య విద్యలో మహిళలు రాణిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. జాతీయస్థాయిలో 4.9 శాతం మంది పురుషులు వైద్యవిద్యను అభ్యసిస్తుంటే.. మహిళలు 13శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. 2011లో దేశ అక్షరాస్యత 73శాతంగా నమోదవ్వగా, 2017నాటికి అది 77 శాతానికి చేరినట్లు కేంద్ర గణాంకశాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి: 'రఫేల్​పై స్వతంత్ర దర్యాప్తు జరపాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.