ETV Bharat / bharat

కరోనా పంజా- మహారాష్ట్రలో 61,695మందికి పాజిటివ్​

author img

By

Published : Apr 15, 2021, 10:40 PM IST

virus
కరోనా

దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో కొత్త కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 61,695 మంది వైరస్​ బారిన పడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​లో తాజాగా 22,439 మందికి కొవిడ్​ సోకింది.

మహారాష్ట్రలో తాజాగా 61,695 కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 36,39,855కి చేరింది. మరో 349మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,20,060 యాక్టివ్​ కేసులున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​లో తాజాగా 22,439 మందికి కొవిడ్​ సోకింది, 104మంది చనిపోయారు. దిల్లీలో 16,699 కరోనా కేసులు నమోదయ్యాయి, 112మంది కరోనాతో మృతి చెందారు.

రాష్ట్రాల వారీగా నమోదైన పాజిటివ్​ కేసులు, మరణాలు

రాష్ట్రంతాజా​ కేసులుతాజా మరణాలు
మధ్యప్రదేశ్​10,16653
పంజాబ్​4,33351
రాజస్థాన్​6,65833
గుజరాత్​8,15281
హరియాణా5,85818
బంగాల్​6,76922
కేరళ8,12620
తమిళనాడు7,98729
కర్ణాటక14,73866

ఇదీ చదవండి: విజృంభిస్తోన్న కరోనా- మహారాష్ట్రలో 60వేల కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.