ETV Bharat / bharat

క్రైమ్​ స్టోరీ రాసేందుకు దొంగతనం చేసిన 'క్రేజీ రైటర్'​.. పోలీసులకు చిక్కి..

author img

By

Published : Jul 6, 2023, 10:33 PM IST

man loot to write crime thiller story
man loot to write crime thiller story

దోపిడీ అంశంతో మంచి క్రైమ్ థ్రిల్లర్​ కథ రాయాలనుకున్నాడు ఓ వ్యక్తి. ఎవరి కథో ఎందుకని.. తానే ఓ దొంగతనం చేసి రాయాలని నిర్ణయించుకున్నాడు. కానీ చివరకు కటకటాల పాలయ్యాడు. అసలేం జరిగిందంటే?

ఉత్తర్​ప్రదేశ్​లోని​ ఫరీదాబాద్​లో విచిత్ర ఘటన జరిగింది. మంచి క్రైమ్ థ్రిల్లర్​ కథ రాసేందుకు ఓ వ్యక్తి దొంగతనం చేశాడు. ప్రత్యక్ష అనుభవాలతో స్టోరీ రాయాలనుకుని కటకటాల పాలయ్యాడు. సొంత స్టోరీ రాసుకుందామనుకునేలోపు.. అతడి కథను పోలీసులు రాశారు!

ఇదీ జరిగింది..
కృష్ణ.. హత్రస్​ జిల్లాలోని ఫర్సోతి గ్రామానికి చెందిన వ్యక్తి. శైలేంద్ర కుమార్​ గోరఖ్​పుర్​ జిల్లా నివాసి. ఇర్షాద్​ రోహ్​తక్​ ఏక్తా కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఫరీదాబాద్​లోని డబువా పాలి రోడ్డులో ఉన్న ఫ్యాన్​ రెగ్యులేటర్లు తయారు చేసే సంజనా టూల్స్ అనే కంపెనీలో ఏడాది కాలంగా కృష్ణ పనిచేస్తున్నాడు. శైలేంద్ర కుమార్​ ఓ నేరగాడు. పలు కేసుల్లో ఇప్పటికే దాదాపు ఎనిమిదేళ్లు జైలు జీవితం గడిపాడు.

శైలేంద్ర.. స్థానికంగా ఉన్న సంజనా టూల్స్​లో చోరీకి పథకం రచించాడు. ఆ పథకాన్ని అమలు​ చేయడానికి అదే కంపెనీలో పనిచేస్తున్న కృష్ణ, ఇర్షాద్​తో పాటు సౌరభ్​ అనే మరో వ్యక్తి చేయి కలిపాడు. కంపెనీ గురించి అన్ని వివరాలు తెలిసిన కృష్ణ సహాయంతో నలుగురు కలిసి జూన్​ 21న కంపెనీలో దొంగతనం చేశారు. యజమాని కుందన్​లాల్​ను కొట్టి.. కట్టేశారు. అనంతరం రాగి తీగల కట్టలు, 58 వేల నగదు, యాజమాని స్కూటీతో పాటు మరికొన్ని విలువైన వస్తువులతో పరారయ్యారు. సమాచారం అందున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

గాలింపు చర్యలు చేపట్టిన ఫరీదాబాద్​ క్రైమ్​ బ్రాంచ్ సెక్టార్​-48​ పోలీసు బృందం.. ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది. సౌరభ్​ మాత్రం తప్పించుకున్నాడు. నిందితుల వద్ద నుంచి 2 రాగి తీగల కట్టలు, రూ. 10 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులను రిమాండ్​కు తీసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇర్షాద్​కు ఎలాంటి నేర చరిత్ర లేదని.. కథలు రాయడం అతడికి హాబీ అని తెలిసింది. దొంగతనం చేసి తన సొంత అనుభవాలతో కథ రాయాలనుకున్నాడని.. కానీ విధి వికటించి పోలీసులకు చిక్కాడు.

man loot to write crime thiller story
క్రైమ్ బ్రాంచ్​ పోలీసులతో నిందితులు

మంచి దొంగలు.. తిరిగి వారే డబ్బులిచ్చారు!
ఇలాంటి వింత దొంగతనం ఇటీవల దేశ రాజధాని దిల్లీలో జరిగింది. రోడ్డుపై నడిచి వెళుతున్న ఓ జంటను దోచుకునే ఆలోచనతో ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు. మద్యం మత్తులో తూగుతూ తుపాకీతో బెదిరించి వారిద్దరినీ తనిఖీ చేశారు. ఆ జంట వద్ద కేవలం రూ.20 మాత్రమే ఉండటం చూసి.. మనసు కరిగింది కాబోలు.. పైగా ఆ మహిళ ఒంటిపై ఉన్న ఆభరణాలు కూడా రోల్డ్ గోల్డ్​వేనని గుర్తించారు. దీంతో దొంగలే వారికి రూ.100 ఇచ్చి అక్కడినుంచి బైక్​పై వెళ్లిపోయారు. బుధవారం అర్ధరాత్రి వేళ ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. వీడియో చూడాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.