ETV Bharat / bharat

రఫేల్​పై మళ్లీ దుమారం- లంచాలపై కీలక ఆధారాలు బహిర్గతం!

author img

By

Published : Nov 8, 2021, 6:33 PM IST

Updated : Nov 8, 2021, 6:49 PM IST

rafale
రఫేల్​

రఫేల్​ ఒప్పందంలో(rafale deal) అవకతవకలకు ఆధారాలు ఉన్నాయంటూ ఫ్రాన్స్​కు చెందిన మీడియాపార్ట్​ ఓ సంచలన వార్తను ప్రచురించింది(rafale deal news). ఓ మధ్యవర్తికి దసో ఏవియేషన్​ భారీ మొత్తంలో నగదు చెల్లించినట్టు ఆరోపించింది. ఇందుకోసం బోగస్​ ఇన్​వాయిస్​లను వినియోగించినట్టు పేర్కొంది(rafale deal corruption).

భారత్​తో రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం(rafale deal corruption) కుదిరేలా చూసేందుకు.. దసో ఏవియేషన్​ సంస్థ భారీగా ముడుపులు ఇచ్చిందంటూ ఫ్రాన్స్​కు చెందిన 'మీడియాపార్ట్​' జర్నల్​ సంచలన వార్త ప్రచురించింది(rafale deal news). ఇందుకోసం బోగస్ ఇన్​వాయిస్​లు రూపొందించిందని వెల్లడించింది. దసో ఏవియేషన్​.. ఓ మధ్యవర్తికి 7.5మిలియన్​ యూరోల(రూ. 64.32కోట్లు) ముడుపులను రహస్యంగా అందించేందుకు ఈ ఇన్​వాయిస్​లు ఉపయోగపడ్డాయని ఆరోపించింది. 36 రఫేల్​ యుద్ధ విమానాల కోసం కుదిరిన రూ. 59వేల కోట్ల ఒప్పందంలో అవకతవకలు జరిగాయా? అనే అంశంపై దర్యాప్తు చేసేందుకు ఫ్రాన్స్​ ప్రభుత్వం జులైలో ఓ న్యాయమూర్తిని నియమించిందని పేర్కొంది మీడియాపార్ట్​.

బోగస్​ ఇన్​వాయిస్​కు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ, భారత దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టలేదని మీడియాపార్ట్​ ఆరోపించింది.

"భారత్​తో రఫేల్​ ఒప్పందం కుదిరేలా చూసేందుకు.. దసో ఏవియేషన్​ ఓ మధ్యవర్తికి 7.5మిలియన్​ యూరోలు ముడుపులు చెల్లించింది. వీటి కోసం బోగస్​ ఇన్​వాయిస్​లను రూపొందించారు. ఆ మధ్యవర్తి పేరు సుశేన్​ గుప్తా. భారత్​లోని సీబీఐ, ఈడీలోని కొందరికి ఈ విషయం తెలుసు. 2018 అక్టోబర్​లోనే వారికి ఆధారాలు లభించాయి. కానీ ఈ విషయంలో ముందుకెళ్లాలని వారు భావించలేదు."

-- మీడియాపార్ట్​

మీడియాపార్ట్​ ఆరోపణలపై(rafale deal controversy) భారత రక్షణశాఖ, దసో ఏవియషన్​ ఇంకా స్పందించలేదు. ఒప్పందంపై గతంలో వచ్చిన ఆరోపణలను రెండు వర్గాలు ఇప్పటికే ఖండించాయి. రఫేల్​ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ.. 2019లో భారత సుప్రీంకోర్టు కూడా సంబంధిత పిటిషన్లను కొట్టివేసింది.

భారత వాయుసేనను పటిష్ఠం చేయడంలో భాగంగా 36 రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్‌తో భారత్‌ 2016లో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.59 వేల కోట్లు. విమానాలను దసో ఏవియేషన్​ సంస్థ తయారు చేస్తోంది. రఫేల్‌ శ్రేణిలో తొలి అయిదు యుద్ధ విమానాలు గతేడాది జులై 29న భారత్‌కు చేరుకున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 36 రఫేల్‌ విమానాలు భారత్‌కు అందాల్సి ఉంది.

ఇవీ చూడండి:-

Last Updated :Nov 8, 2021, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.