ETV Bharat / bharat

ఆత్మరక్షణకై చిరుతను కొట్టి చంపిన రైతులు

author img

By

Published : Mar 24, 2021, 1:02 PM IST

Farmer killed Leopard to escape from attack
ప్రాణాలు రక్షించుకునేందుకు చిరుతను చంపిన రైతులు

పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఇద్దరు రైతులపై చిరుతపులి దాడి చేసింది. ఆత్మరక్షణ కోసం ఆ వన్యమృగాన్ని వారిద్దరూ కలిసి చంపేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఓ చిరుత పులిని చంపేశారు ఇద్దరు రైతులు. ఈ ఘటన కర్ణాటకలోని హవేరి జిల్లా బులపురలో జరిగింది.

గాయాలతో బయటపడి...

గాడిగెప్ప, క్రిష్ణప్ప అనే ఇద్దరు రైతులు బుధవారం ఉదయం 3 గంటలకు పొలానికి వెళ్లగా ఓ చిరుత పులి వారిపై దాడి చేసింది. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు చిరుతపై తిరిగి దాడి చేశారు. ఓ బండ రాయితో ఆ వన్యమృగాన్ని కొట్టారు. కాసేపటి తర్వాత ఆ చిరుత అక్కడే కన్నుమూసింది.

ఈ ఘటనలో గాడిగెప్పకు తీవ్రంగా గాయాలయ్యాయని, ఆయనను చిత్రదుర్గ ఆసుపత్రిలో చేర్పించామని స్థానికులు తెలిపారు. క్రిష్ణగప్పకు స్వల్పగాయాలైనట్లు పేర్కొన్నారు.

Farmer killed Leopard to escape from attack
రాయితో చిరుతను కొట్టి చంపిన రైతులు
Farmer killed Leopard to escape from attack
తీవ్రగాయాలతో గాడిగెప్ప
Farmer killed Leopard to escape from attack
స్వల్ప గాయాలతో బయటపడ్డ క్రిష్ణప్ప

ఇదీ చదవండి:200 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.