ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం.. స్థానికేతరులపై ఉగ్రదాడి

author img

By

Published : Nov 3, 2022, 8:11 PM IST

Updated : Nov 3, 2022, 10:11 PM IST

encounter in poonch
ఎన్​కౌంటర్

జమ్ముకశ్మీర్​లో భారీ ఎన్​కౌంటర్ జరిగింది. నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు యత్నించిన ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి భద్రతాబలగాలు. మరోవైపు, అనంతనాగ్​లో ఇద్దరు వలసకూలీలపై కాల్పులకు పాల్పడ్డాడు ఓ ఉగ్రవాది.

జమ్ముకశ్మీర్‌ పూంచ్ జిల్లాలో భారీ ఎన్​కౌంటర్ జరిగింది. నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు యత్నించిన ముగ్గురు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మృతుల్లో ఒక ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. మరో ఇద్దరి మృతదేహాలను పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని గ్రామస్థులు తీసుకెళ్లారని పేర్కొన్నారు. మొదట సైనికులపై కాల్పులు జరిపారు ముష్కరులు. దీంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని వెల్లడించారు. ఈ ఘటన అనంతరం రెండు ఏకే-47 రైఫిళ్లు, ఒక తుపాకీని అధికారులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

మరోవైపు, అనంత్​నాగ్​ జిల్లాలో ఓ ముష్కరుడు రెచ్చిపోయాడు. బోండియాల్​గామ్​లో ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరినీ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులిద్దరినీ బిహార్​, నేపాల్​కు చెందిన వలసకూలీలుగా పోలీసులు గుర్తించారు.

ఇవీ చదవండి: ఈడీ విచారణకు సీఎం డుమ్మా.. దమ్ముంటే అరెస్టు చేయండంటూ సవాల్

నిద్ర పోటీలకు మీరు రెడీనా?.. రూ.లక్ష స్టైపెండ్!.. గెలిస్తే రూ.10లక్షలు

Last Updated :Nov 3, 2022, 10:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.