ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- నలుగురు ముష్కరులు హతం

author img

By

Published : Apr 14, 2022, 5:24 PM IST

Updated : Apr 14, 2022, 6:03 PM IST

Encounter breaks out in south Kashmir's Shopian
కశ్మీర్ ఎన్​కౌంటర్​

South Kashmir News: జమ్ముకశ్మీర్​ షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో నలుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు.. ఎన్​కౌంటర్​ జరుగుతున్న ప్రదేశానికి సైనిక సిబ్బందితో వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురి కాగా.. ఇద్దరు జవాన్లు మరణించారు.

Shopian Encounter news: జమ్ముకశ్మీర్​ షోపియాన్​ జిల్లాలో నలుగురు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు హతమర్చాయి. జైనపొరా ప్రాంతంలోని బాడిగామ్​లో ముష్కరులు ఉన్నట్లు గురువారం మధ్యాహ్నం నిఘా వర్గాలకు సమాచారం అందింది. పోలీసులు, సాయుధ దళాలు కలిసి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ముష్కరులు దాగి ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. లొంగిపోవాలని మైక్​ల ద్వారా కోరారు. అయితే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. భద్రతా సిబ్బంది దీటుగా స్పందించారు. అనేక గంటలపాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరంతా లష్కరే తొయిబా ఉగ్రమూకకు చెందినవారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఇద్దరు జవాన్లు మృతి: షోపియాన్​లో ఎన్​కౌంటర్ జరుగుతున్న ప్రదేశానికి సైనిక సిబ్బందితో వెళ్తున్న టాటా సుమో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని తొలుత షోపియాన్ జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం శ్రీనగర్ హాస్పిటల్​కు తరలించారు.

ఇదీ చదవండి: చిన్న ఘర్షణకు ప్రాణాలు బలి.. ఒక్కసారిగా కుప్పకూలి మృతి

Last Updated :Apr 14, 2022, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.