ETV Bharat / bharat

ఆ రాష్ట్రాల ఎన్నికలపై కసరత్తు షురూ..!

author img

By

Published : Jul 28, 2021, 10:54 PM IST

Sushil Chandra
సుశీల్​ చంద్ర

వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం ప్రయత్నాలు చేపట్టింది ఎన్నికల సంఘం. ఇందులో భాగంగా ముందుస్తు ప్రణాళికలపై ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులతో సమీక్ష నిర్వహించారు భారత ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్​ చంద్ర. పోలింగ్​ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు సహా పలు అంశాలపై చర్చించారు.

వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల కమిషనర్లతో భారత ప్రధాన ఎన్నికల అధికారి​​ సుశీల్​ చంద్ర భేటీ అయ్యారు. ఎన్నికల ముందస్తు ప్రణాళికపై సమీక్షించారు.

గోవా, మణిపూర్​, పంజాబ్​, ఉత్తరాఖండ్​, ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది మే నాటికి ప్రభుత్వాల పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో.. కసరత్తు చేపట్టింది ఈసీ. బుధవారం జరిగిన ఈ సమావేశంలో పోలింగ్​ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, ఓటర్లకు రిజిస్ట్రేషన్ సౌలభ్యం, ఓటరు జాబితా, ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం, ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ యంత్రాలు, పేపర్​ ట్రైల్​ మెషీన్ల ఏర్పాట్లు, 80 ఏళ్లుపైబడిన సీనియర్ సిటిజన్ల, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వంటి వివిధ అంశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

వీటితో పాటు కొవిడ్​ ఉపశమ ప్రణాళిక, ఎన్నికల సిబ్బందికి శిక్షణ వంటి పలు అంశాలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. నిష్పక్షపాతం, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించటమే తమ లక్ష్యమని సుశీల్​ చంద్ర పేర్కొన్నారు. ఒక్కోరాష్ట్రంలో ఒక్కోలా సవాళ్లు ఉంటాయని.. వాటిని అధిగమించడానికి సరైన ప్రణాళిక అవసరమన్నారు. ఓటరు జాబితా ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఓటరు నమోదు కోసం పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సీఈఓలకు సూచించారు.

ఇదీ చూడండి: 'టీకా తీసుకునేలా మత, సంఘాల నేతలు ప్రోత్సహించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.