ETV Bharat / bharat

ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదుల అరెస్టు

author img

By

Published : Nov 17, 2020, 9:00 AM IST

Updated : Nov 17, 2020, 11:51 AM IST

delhi-police-arrests-two-jem-terrorists
ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదుల అరెస్టు

08:54 November 17

ఉగ్రవాదుల అరెస్టు

Delhi Police arrests two JeM terrorists
ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదుల అరెస్టు

పాకిస్థాన్​ ఉగ్రసంస్థ జైషే మహ్మద్​కు చెందిన ఇద్దరు ముష్కరులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అర్ధరాత్రి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి 2 తుపాకులు, పేలుడు పదార్థాలు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో దిల్లీ ప్రత్యేక పోలీస్ విభాగం సరాయ్ కాలె ఖాన్​లో సోమవారం అర్ధరాత్రి తనిఖీలు చేపట్టింది. అనంతరం ఇద్దరినీ అరెస్టు చేశారు అధికారులు. ఇద్దరు ఉగ్రవాదులను అబ్దుల్ లాతిఫ్, అశ్రఫ్​ ఖతనాగా గుర్తించారు. జమ్ముకశ్మీర్​లోని బారాముల్లా, కుప్వారాలో వీరు నివాసముంటున్నట్లు పేర్కొన్నారు.

Last Updated :Nov 17, 2020, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.