ETV Bharat / bharat

ఏప్రిల్​లోనే 1500 మంది దిల్లీ పోలీసులకు కరోనా

author img

By

Published : Apr 23, 2021, 10:06 AM IST

Delhi police
దిల్లీపోలీసులకు కరోనా

1500 మంది దిల్లీ పోలీసులకు ఈ ఏప్రిల్​లో కరోనా సోకింది. 2300 మంది రైల్వేసిబ్బంది కూడా వైరస్ బారినపడ్డారు.

దిల్లీలో కరోనా విజృంభిస్తోంది. కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ఏప్రిల్​లోనే 1500 మంది దిల్లీ పోలీసులు వైరస్ బారినపడ్డట్లు తెలుస్తోంది.

వైరస్ వ్యాప్తి మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు 9000కు పైగా దిల్లీ పోలీసులకు కరోనా సోకిందని అధికారులు వెల్లడించారు. మొత్తంగా 37మంది చనిపోయారని, ఈ ఏప్రిల్​లో ఇద్దరు మృతి చెందారని తెలిపారు.

రైల్వే సిబ్బందికి..

2300 మంది తూర్పు రైల్వే సిబ్బంది కూడా వైరస్​ బారినపడ్డారు. లాక్​డౌన్ భయంతో బిహార్​కు వలసలు పెరిగిన నేపథ్యంలో ఈ కేసులు పెరిగినట్లు రైల్వే శాఖ పేర్కొంది. అయినా రైల్వేలను వలస కూలీలకోసం నడపడం ఆపబోమని తూర్పు రైల్వే శాఖ పీఆర్ఓ సంజయ్ కుమార్ ప్రసాద్ తెలిపారు.

ఇదీ చదవండి: 8 రోజుల్లోనే కొవిడ్ ఆస్పత్రి నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.