ETV Bharat / bharat

కేరళలో కరోనా పంజా- కొత్తగా 43,529 కేసులు

author img

By

Published : May 12, 2021, 7:11 PM IST

Updated : May 12, 2021, 8:44 PM IST

Kerala logs 43,529 new cases, 95 deaths
కేరళలో కరోనా పంజా

దేశంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. కేరళలో రికార్డుస్థాయిలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే అత్యధికంగా 43,529 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 95 మంది వైరస్​తో మరణించారు. మహారాష్ట్రలో ఒక్కరోజే 46 వేలు, కర్ణాటకలో దాదాపు 40 వేల కొత్త కేసులు వెలుగుచూశాయి.

దేశంలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. కేరళలో రికార్డు స్థాయిలో ఒక్కరోజులోనే అత్యధికంగా 43,529 మందికి వైరస్ నిర్ధరణ అయింది. ఆ రాష్ట్రంలో ఒక్కరోజు కేసుల్లో ఇవే అత్యధికం. కేరళలో మొత్తం కేసుల సంఖ్య 19,80,879కు చేరింది. కొత్తగా వైరస్​ ధాటికి మరో 95 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 6,053కు చేరింది. కేరళలో వైరస్ పాజిటివిటీ రేటు 29.75 శాతంగా ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

మహారాష్ట్రలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 46,781 మందికి వైరస్​ సోకింది. మరో 816 మంది ప్రాణాలు కోల్పోయారు.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

  • కర్ణాటకలో మరో 39,998 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 517 మంది కరోనాతో మృతిచెందారు.
  • ఉత్తర్ ప్రదేశ్​లో 18,125 కేసులు నమోదు కాగా, వైరస్ ధాటికి మరో 329 మంది మరణించారు.
  • దిల్లీలో ఒక్కరోజే 13,287 మందికి వైరస్​ నిర్ధరణ కాగా మరో 300 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • తమిళనాడులో ఇవాళ 30,355 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 293 మంది మరణించారు.
  • బంగాల్​లో 20,377 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. మరో 135 మంది వైరస్​కు బలయ్యారు

ఇదీ చదవండి : వరుసగా రెండోరోజు తగ్గిన యాక్టివ్ కేసులు

Last Updated :May 12, 2021, 8:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.