ETV Bharat / bharat

ఏడు దేశాలతో భారత్ కీలక భేటీ- తాలిబన్లకు సందేశం వెళ్తుందా?

author img

By

Published : Nov 9, 2021, 2:12 PM IST

China not to attend NSA meeting hosted by India on Afghanistan citing scheduling issues
ఏడు దేశాలతో భారత్ కీలక భేటీ.. కాబుల్​కు సందేశం వెళ్తుందా?

అఫ్గాన్ అంశమే ప్రధాన అజెండాగా రష్యా, ఇరాన్ సహా సెంట్రల్ ఆసియాలోని ఐదు దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో బుధవారం కీలక భేటీ నిర్వహిస్తోంది భారత్(india meet on afghanistan)​. పాకిస్థాన్​, చైనా మాత్రం సమావేశానికి హాజరయ్యేందుకు నిరాకరించాయి. ఈ భేటీలో ఏ అంశాలు చర్చిస్తారు? తాలిబన్ల ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించే అంశం అజెండాలో ఉందా? కాబుల్​కు భారత్​ ఏం సందేశం పంపబోతుంది? వంటి విషయాలను పరిశీలిద్దాం.

రెండు దశాబ్దాల పాటు అఫ్గానిస్థాన్​ పునర్​నిర్మాణంలో భారత్ అత్యంత కీలక పాత్ర పోషించింది. ఆ దేశంలో ప్రజాకేంద్రీకృత ప్రాజెక్టుల కోసం ఏకంగా 3 బిలియన్​ డాలర్లకు పైగా వెచ్చించింది. ఈ ఏడాది ఆగస్టులో అప్గాన్​ను ఆక్రమించి అధికారం చేపట్టిన తాలిబన్లు కూడా భారత్​ భాగస్వామ్యాన్ని గుర్తించారు.

జీ20, బ్రిక్స్​ సదస్సులు సహా ద్వైపాక్షిక చర్చల్లోనూ భారత్ ప్రతిసారి అఫ్గాన్ సమస్యను లేవనెత్తుతోంది. ఈ నేపథ్యంలోనే నవంబర్​ 10న రష్యా, ఇరాన్​ సహా సెంట్రల్​ ఆసియాలోని ఐదు దేశాల భద్రతా సలాహాదారులతో సమావేశం నిర్వహిస్తోంది(india meet on afghanistan). దిల్లీలో జరిగే ఈ భేటీకి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్ నేతృత్వం వహిస్తారు(ajit doval meeting on afghanistan). ప్రాంతీయ సమస్యపై చర్చించేందుకు ఇన్ని దేశాలతో ఈ తరహా సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి.

ఏఏ దేశాలు హాజరవుతున్నాయి?

ఈ సమావేశానికి రష్యా, ఇరాన్​, తజికిస్థాన్​, కిర్జిస్థాన్​, కజఖ్​స్థాన్​, ఉజ్బెకిస్థాన్​, తుర్క్​మెనిస్థాన్​ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు హజరవుతారు(nsa meeting on afghanistan). ఇంతకుముందు ఇరాన్ ఈ తరహా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ దేశమే 2018, 2019లో ఈ తరహా భేటీలకు ఆతిథ్యమిచ్చింది. అయితే భారత్ నిర్వహిస్తున్న సమావేశంలో అత్యధికంగా ఏడు దేశాలు పాల్గొంటున్నాయి.

చైనా, పాక్ మాటేంటి?

ఈ ఫార్మాట్​ను అనుసరించి సమావేశానికి హాజరుకావాలని చైనా, పాకిస్థాన్​కు కూడా భారత్​ ఆహ్వానం పంపింది(india role in afghanistan ). అయితే ఊహించినట్టే ఈ రెండు దేశాలు భేటీలో పాల్గొనేందుకు నిరాకరించాయి. షెడ్యూల్​ సమస్య కారణంగా తాము రాలేమని చైనా సాకు చెప్పింది. అయితే అఫ్గాన్ అంశంపై భారత్​తో ద్వైపాక్షిక, బహుపాక్షిక చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని పేర్కొంది. గతంలో ఇరాన్​ ఆతిథ్యమిచ్చిన రెండు సమావేశాలతో పాటు, బ్రిక్స్ సమావేశానికి చైనా హాజరైంది.

అఫ్గాన్ సమస్య పరిష్కారంలో భాగం కావాలాని పాకిస్థాన్ ఎప్పుడూ కోరుకోలేదని అధికారులు భావిస్తున్నారు. నిజానికి అఫ్గాన్ సంక్షోభానికి పాకిస్థానే కారణమని చెబుతున్నారు. తాలిబన్లకు మొదటి నుంచి ఆ దేశం సాయం చేస్తోందనే విషయం ప్రపంచానికి తెలిసిన బహిరంగ రహస్యం. అలాగే పాక్ గూఢచార సంస్థం ఐఎస్​ఐ... అఫ్గాన్​లోని హక్కానీ, ఐసిస్​ ఖోరసన్​కు సాయం చేస్తోందనే విషయమూ అందిరికీ తెలిసిందే.

అఫ్గాన్​కు(afghanistan news ) ఇతర దేశాల నుంచి మానవతా సాయం అందకుండా పాకిస్థానే ప్రధాన అడ్డంకిగా మారింది. అఫ్గాన్​ ప్రజలకు అవసరమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నప్పటికీ పాకిస్థానే.. దాన్ని వారికి చేరకుండా చేస్తోంది. ఇరాన్ గతంలో ఆతిథ్యమిచ్చిన సమావేశాలకు కూడా పాక్ హాజరుకాలేదు. ఇప్పడు భారత్ ఆహ్వానాన్ని కూడా తిరస్కరించింది.

ఏఏ అంశాలు చర్చిస్తారు?

ఏడు దేశాలు పాల్గొంటున్న ఈ సమావేశంలో(india meeting on afghanistan) అఫ్గాన్​లో ఉగ్రవాదం, ఇతర దేశాలకు అక్కడి ఉగ్రకార్యకలాపాల వల్ల పొంచి ఉన్న ముప్పు, అక్కడి అతివాదంపై ప్రధానంగా చర్చ జరగనుంది. అఫ్గాన్​లో ప్రస్తుతమున్న భావజాలం తమ దేశాలను కూడా ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఈ దేశాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే అఫ్గాన్​లో డ్రగ్​ ట్రాఫికింగ్​, అమెరికా సైన్యం విడిచివెళ్లిన అత్యాధునిక ఆయుధాలను తాలిబన్లు దుర్వినియోగం చేస్తారేమోననే భయాలు ఉన్నాయి. వీటన్నింటికీ మించి తర్వత ఏం జరుగుతుందోననే అనిశ్చితిపై ఈ ఏడు దేశాల సమావేశంలో కీలక చర్చ జరిగే అవకాశముంది. పాకిస్థాన్​కు మాత్రం ఈ అంశాలపై ఎలాంటి ఆందోళన లేదు. ఇప్పటికే ఆ దేశం తాలిబన్లకు మద్దతుగా ఉంటూ సంప్రదింపులు కొనసాగిస్తోంది.

తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తిస్తాయా?

ఇరాన్, రష్యా సహా ఈ సమావేశంలో పాల్గొంటున్న ఇతర దేశాలు అఫ్గాన్​లో తాలిబన్ల ప్రభుత్వాన్ని(afghan taliban news) గుర్తించేందుకు సముఖంగా లేవు. ఈ సమావేశం అజెండాలో అసలు ఈ విషయమే లేదని అధికారిక వర్గాలు తెలిపాయి. 1990ల నాటి తాలిబన్ ఆటవిక ప్రభుత్వానికి ప్రస్తుత తాలిబన్లకు ఏమాత్రం తేడా లేదని ఈ దేశాలు భావిస్తున్నాయి. అఫ్గాన్​లో(afghanistan news latest) మైనారిటీల ప్రాతినిధ్యం, ఐక్యతా భావం, మహిళల హక్కులు, మానవహక్కులు వంటివి ఏడు దేశాల ఉమ్మడి అంశాలు.

రష్యా, ఇరాన్ సహా ఇతర మధ్య ఆసియా దేశాలు తాలిబన్లతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ తమ వైఖరెేంటో స్పష్టం చేశాయి. ఈ ప్రాంతంలో భారత్​ కీలక భాగస్వామి అని అవి బలంగా నమ్ముతున్నాయి.

ఈ సమావేశంలో ఏడు దేశాల ఏకాభిప్రాయం, ఉమ్మడి అజెండా చర్చల్లో ప్రతిబింబిస్తుంది. ఇది ప్రోటోకాల్​ ఆధారిత చర్చ కాదు.. వాస్తవ పరిస్థితులపై జరుగుతున్న సమావేశం. అయితే భేటీతో ఆసియా దేశాలు ఇస్తున్న సందేశాన్ని కాబుల్​లో తాలిబన్లు ఏ విధంగా తీసుకుంటారనే విషయమే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ఇదీ చదవండి: పాక్​తో కలిసి చైనా కుట్ర- అధునాతన యుద్ధనౌకతో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.