ETV Bharat / bharat

సచిన్, ధోనీ, అభిషేక్​ బచ్చన్​ పేర్లతో ఫ్రాడ్.. బ్యాంకులకు రూ.90లక్షలు టోకరా

author img

By

Published : Mar 3, 2023, 5:05 PM IST

Fake ID cards of celebrities
Fake ID cards of celebrities

సచిన్​ తెందూల్కర్​, మహేంద్ర సింగ్ ధోనీ, అభిషేక్​ బచ్చన్​, ఐశ్వర్యరాయ్​, సుస్మితా సేన్​తో సహా 95 మందికి పైగా ప్రముఖుల వివరాలతో ఓ ముఠా వివిధ బ్యాంకుల్లో రూ.90 లక్షలు మేర మోసం చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.

దేశ రాజధానిలో ఘరానా మోసం వెలుగుచూసింది. ఓ సైబర్​ నేరగాళ్ల ముఠా కిక్రెట్, సినీ రంగానికి చెందిన ప్రముఖుల పేర్లతో బ్యాంకులను రూ.90 లక్షలకు పైగా మోసం చేసింది. ఈ దొంగలు ముఠా ఈ నేరాలు పాల్పడేందుకు.. క్రికెట్​ దిగ్గజాలు సచిన్ తెందూల్కర్,​ ఎమ్​ ఎస్​ ధోనీ.. సినీ ప్రముఖులు హృతిక్​ రోషన్, అభిషేక్ బచ్చన్​​తో పాటుగా మరికొంత మంది సెలబ్రిటీల వివరాలను ఉపయోగించడం విశేషం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఓ సైబర్​ నేరగాళ్ల ముఠా గతకొంత కాలంగా.. దిల్లీలో హైటెక్​ మోసాలకు పాల్పడుతోంది. ఈ ముఠా దేశంలోని క్రికెట్​, సినీ రంగాలకు చెందిన దాదాపు 90 మంది ప్రముఖుల వివరాలతో బ్యాంకులకు.. రూ.90 లక్షలకు పైగా మోసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. దర్యాప్తు చేపట్టిన షాహదారా జిల్లా పోలీసులు శుక్రవారం ఈ ముఠాకు చెందిన సునీల్ కుమార్, పునీత్, ఆసిఫ్, విశ్వ భాస్కర్ శర్మతో పాటుగా మరో వ్యక్తిని అరెస్ట్​ చేశారు. నిందితుల్ని విచారించిన పోలీసులకు వారు విస్తుపోయే నిజాలను వెల్లడించారు. వీరు సెలబ్రిటీల పేరుతో నకిలీ పాన్​కార్డ్​లను ఉపయోగించి వివిధ బ్యాంకులకు రూ.90 లక్షలకు పైగా మోసం చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి 10 మొబైల్ ఫోన్స్​, 1 ల్యాప్‌టాప్, 3 సీపీయూలు, 34 నకిలీ పాన్ కార్డులు, 25 నకిలీ ఆధార్ కార్డులు, 40 డెబిట్/క్రెడిట్ కార్డులు సహా పలు ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ముఠా సభ్యులు.. ప్రముఖులకు చెందిన జీఎస్టీ వివరాలను సంపాదించి దాని ద్వారా వారి పాన్ నంబర్​ను తెలుకునేవారు. దీంతో వీరు సెలబ్రిటీల పేర్లతో నకిలీ పాన్​కార్డ్, ఆధార్​ కార్డును తయారు చేసుకునేవారు. ఆ తర్వాత వివిధ బ్యాంకుల నుంచి క్రెడిట్​ కార్డులను పొంది వాటితో లక్షలు విలువ చేసే వస్తువులను కొనుగోలు చేసేవారు. ఈ ముఠా వినియోగించిన నకిలీ పాన్​కార్టుల్లో.. ప్రముఖ క్రికెట్ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​, టీమిండియా మాజీ కెప్టెన్​ ఎమ్​ఎస్​ ధోని, ప్రముఖ బాలీవుడ్​ నటీనటులు హృతిక్​ రోషన్​, అభిషేక్ బచ్చన్​, సోనమ్​ కపూర్​, సైఫ్​ అలీఖాన్​, అలియా భట్​, శిల్పాశెట్టితో పాటుగా మరికొందరి పేర్లు ఉన్నాయి. ఈ విషయాన్ని షాహదారా డీసీపీ రోహిత్​ మీనా వెల్లడించారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Fake ID cards of celebrities
అభిషేక్​ బచ్చన్​ పేరుతో నకిలీ పాన్​కార్డ్​ తయారు చేసిన దొంగల ముఠా

కేంద్ర మంత్రి పేరుతో దందాలు!
కేంద్ర మంత్రిని, సోనియా గాంధీ పీఏని అని చెప్పుకునే తిరిగే ఓ మోసగాడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటుగా అతని ముగ్గురు సహచరులను కూడా దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సంజయ్​ తివారీ అనే వ్యక్తి తాను కేంద్రమంత్రినని చెప్పుకుంటా ఓ వ్యక్తిని తన వద్దకు పిలిచాడు. దీంతో సదరు వ్యక్తి ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. రంగంలోకి దిగిన దిల్లీ పోలీసులు.. సంజయ్​తో పాటుగా అతని అనుచరులను అరెస్ట్​ చేశారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్​ ఏజెన్సీతో పాటుగా నిందితుల్ని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే సంజయ్​కు గతంలో కూడా ఇదే తరహా నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2017లో సంజయ్​ కాంగ్రెస్​ నాయకురాలు సోనియా గాంధీకి పర్సనల్​ అసిస్టెంట్​(పీఏ)గా చెప్పుకుని తిరిగేవాడు. గతంలో ఈ విషయంలో సంజయ్​ అరెస్ట్ అయినట్లు కూడా పోలీసులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.