ETV Bharat / bharat

Central Cabinet Decisions Today : వారందరికీ సబ్సిడీపై రూ.2 లక్షలు లోన్​.. కేంద్రం గుడ్​న్యూస్

author img

By

Published : Aug 16, 2023, 3:46 PM IST

Updated : Aug 16, 2023, 4:25 PM IST

central cabinet decisions today
central cabinet decisions today

Central Cabinet Decisions Today 16th August 2023 : చేతి వృత్తులవారికి అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'విశ్వకర్మ' పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకానికి రూ.13,000 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. విశ్వకర్మ పథకం ద్వారా చేతివృత్తుల వారికి రూ. 2 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. అలాగే కేంద్ర కేబినెట్ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

Central Cabinet Decisions Today : ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కీలక ప్రకటనలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. బీసీ కులవృత్తులకు అండగా ఉండడమే లక్ష్యంగా ప్రకటించిన 'విశ్వకర్మ' పథకానికి రూ. 13,000 కోట్లు కేటాయించింది. విశ్వకర్మ పథకం ద్వారా చేతివృత్తుల వారికి రూ. 2 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది.

Vishwakarma Scheme Details : రోజుకు 500 రూపాయల ఉపకార వేతనంతో శిక్షణ కార్యక్రమాలు ఇవ్వనున్నట్లు తెలిపిన కేంద్రం.. ఆ తర్వాత పరికరాల కొనుగోలు చేసేందుకు రూ.15 వేలు ఆర్థిక సాయం అందించనుంది. శిక్షణ తర్వాత 5శాతం వడ్డీతో లక్ష రూపాయల రుణం ఇవ్వనుంది. తొలి విడత రుణం సద్వినియోగం చేసుకుంటే అదనంగా మరో లక్ష రుణం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్‌ 17న ప్రారంభం కానున్న ఈ పథకం ద్వారా 30లక్షల మంది సంప్రదాయ చేతివృత్తి కళాకారులు, చేనేత కార్మికులు, స్వర్ణకారులు, కులవృత్తులు చేసేవారు లబ్ధిపొందనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

  • The PM in Union Cabinet meeting today approved ‘PM Vishwakarma’ scheme to support people with traditional skills. Under this scheme, loans up to Rs 1 lakh will be provided on liberal terms: Union Minister Ashwini Vaishnaw pic.twitter.com/CcDkV5slX1

    — ANI (@ANI) August 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

PM E Bus Seva News In Telugu : అలాగే పీఎం ఈ-బస్‌ సేవా పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 10 వేల ఈ-సిటీ బస్సులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో 169 నగరాల్లో ఈ-సిటీ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిన కేంద్రం.. ఇందుకు రూ. 77,613 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. 3లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలకు.. ఈ బస్సులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్​ తెలిపారు.

  • #WATCH | During a briefing on Union Cabinet decisions, Union Minsiter Anurag Thakur says "PM E-Bus Seva has been given approval. Rs 57,613 crores will be spent on this. Around 10,000 new electric buses will be provided across the country" pic.twitter.com/op6EqBgAZZ

    — ANI (@ANI) August 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

డిజిటల్ ఇండియా పథకం కొనసాగింపు..
మరోవైపు డిజిటల్‌ ఇండియా పథకం కొనసాగింపునకు.. రూ.14,903 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద 5.25 లక్షల మంది ఐటీ ఉద్యోగుల నైపుణ్యాలు మెరుగుపర్చేందుకు, 2.65 లక్షల మంది ఐటీ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు నిధులు వెచ్చించనున్నారు.

ఏపీ, తెలంగాణలో రైల్వే లైన్ల విస్తరణకు ఆమోదముద్ర..
రూ.32,500 కోట్లు విలువైన ఏడు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు చెందిన 35 జిల్లాల్లో రైల్వే లైన్ల విస్తరణకు ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుల కింద మొత్తం 2,339 కిలోమీటర్ల మేర రైల్వే విస్తరణ పనులు చేపట్టనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు.

'శ్రీకృష్ణ జన్మస్థలిలో ఆక్రమణల తొలగింపు ఆపండి'.. రైల్వే శాఖ డ్రైవ్​పై సుప్రీం ఆదేశాలు

వ్యక్తిగత డేటా పరిరక్షణకు బిల్లుకు కేబినెట్ ఓకే.. రూల్స్ ఉల్లంఘిస్తే రూ.250 కోట్ల ఫైన్​!

Last Updated :Aug 16, 2023, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.