ETV Bharat / bharat

సీబీఐ కార్యాలయంలో 68 మందికి కరోనా

author img

By

Published : Jan 8, 2022, 5:12 PM IST

Updated : Jan 8, 2022, 5:41 PM IST

cbi corona
సీబీఐ కార్యాలయంలో 68 మందికి కరోనా

CBI Corona News: ముంబయిలోని సీబీఐ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. మొత్తం 235 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 68 మందికి పాజిటివ్​ అని తేలింది.

CBI Corona News: ఒమిక్రాన్​ ప్రభావంతో దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. అధికారులు, వైద్య సిబ్బంది కూడా ఇందుకు మినహాయింపు కాదు. జాగ్రత్తలు పాటిస్తున్నా వైరస్​ బారిన పడుతున్నారు. తాజాగా ముంబయిలోని సీబీఐ కార్యాలయంలో 68 మందికి పాజిటివ్​ అని నిర్ధరణ అయింది.

బాంద్రా- కుర్లా కాంప్లెక్స్​లోని కార్యాలయంలో మొత్తం 235 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా 68 మందికి పాజిటివ్​ వచ్చింది. వైరస్​ బారిన పడినవారు హోం క్వారంటైన్​లో ఉంటారని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి : 'రైళ్లలో ప్రయాణించాలంటే.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి'

Last Updated :Jan 8, 2022, 5:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.