ETV Bharat / bharat

భాజపా గెలుపుగుర్రాల తొలి జాబితా ఈ వారమే!

author img

By

Published : Mar 2, 2021, 5:59 AM IST

bjp-likely-to-release-first-list-of-candidates-for-upcoming-assembly-polls-in-first-week-of-march
భాజపా గెలుపుగుర్రాల తొలి జాబితా ఈ వారమే!

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ ఈ వారం సమావేశం కానుంది. ఈ భేటీ తర్వాత భాజపా అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తొలిసారి ఈ నెల 7న బంగాల్​లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. ఈ సభను కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రాత్మకంగా నిర్వహించాలని భాజపా శ్రేణులు భావిస్తున్నాయి.

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సహా తమిళనాడు, బంగాల్, కేరళ, అసోం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను ఎంపిక చేసే కసరత్తును ప్రారంభించనుంది భాజపా. ఈ వారమే ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మార్చి 4న ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నాయి.

భాజపా కేంద్ర ఎన్నికల కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్​ షా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చవాన్​ ఉన్నారు.

పుదుచ్చేరి(33), తమిళనాడు(234), బంగాల్(294), కేరళ(140), అసోం(126) అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారమే ప్రకటించింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. బంగాల్​లో 8 విడతల్లో, అసోంలో మూడు విడతల్లో నిర్వహించనున్నారు. మే 2న ఫలితాలు వెలువడుతాయి.

మోదీ మెగా ర్యాలీ

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తొలిసారిగా బంగాల్​లో ఈ నెల 7న పర్యటించనున్నారు మోదీ. కోల్​కతా బ్రిగేడ్​ పరేడ్​ గ్రౌండ్​లో మోదీ పాల్గొనే ర్యాలీని కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని భాజపా శ్రేణులు భావిస్తున్నాయి. దీని కోసం బూత్​ స్థాయి కార్యకర్తల నుంచి ఎంపీల వరకు అందరూ గడప గడపా తిరిగి ప్రజలను సభకు ఆహ్వానించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. సామాజిక మధ్యమాల్లోనూ ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టాలని భావిస్తున్నారు. బంగాల్​ ఓటర్ల మూడ్​ను ప్రతిబింబించేలా సభ ఉండాలని, అందుకే ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కంకణం కట్టుకున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.

ఇదీ చూడండి: 'పంజాబ్​ సీఎం'కు ప్రధాన సలహాదారుగా ప్రశాంత్​ కిశోర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.