ETV Bharat / bharat

'తుది శ్వాస వరకు రాజస్థాన్​ ప్రజల కోసం పోరాడతా'

author img

By

Published : Aug 12, 2020, 1:09 PM IST

Will serve people of Rajasthan till last breath, says Sachin Pilot
'తుది శ్వాస వరకు రాజస్థాన్​ ప్రజల కోసం పోరాడతా'

పార్టీ పదవిలో ఉన్నా లేకపోయినా రాజస్థాన్ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు ఆ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్. రాష్ట్ర ప్రజలతో విడదీయరాని బంధం ఉందని ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖిలో చెప్పారు.

రాజస్థాన్​లో నెలన్నర రోజులుగా కొనసాగిన రాజకీయ సంక్షోభానికి తెరపడింది. కాంగ్రెస్ అసంతృప్త నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్.. తిరిగి పార్టీ గూటికి చేరిపోయారు. ఆగస్టు 14 నుంచి కీలకమైన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సచిన్​ పైలట్​తో ప్రత్యేకంగా మాట్లాడింది ఈటీవీ భారత్.

పదవులు ముఖ్యం కాదు

ఆరేళ్ల పదవీ కాలంతో రాజస్థాన్​లో సుదీర్ఘ కాలం పనిచేసిన పీసీసీ చీఫ్​గా సచిన్ రికార్డు సృష్టించారు. అయితే ఈ పదవుల కోసం తానెప్పుడూ పరితపించలేదని ఆయన స్పష్టం చేశారు. గత ఆరేళ్లుగా తనకు మద్దతిచ్చిన ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని పేర్కొన్నారు.

సచిన్​ పైలట్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

"రాజస్థాన్ ప్రజలతో నాకు అవినాభావ బంధం ఉంది. పార్టీలో పదవి ఉన్నా లేకపోయినా, చివరి శ్వాస వరకు ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాను."

-సచిన్ పైలట్

అధిష్ఠానం ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు సచిన్. తాము లేవనెత్తిన సమస్యలను కమిటీ పరిష్కరిస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు.

ఇదీ చదవండి- బెంగళూరులో ఒక్కసారిగా ఎందుకింత హింస?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.