ETV Bharat / bharat

అసెంబ్లీ సమావేశాలకు రాజస్థాన్​ గవర్నర్​ అనుమతి

author img

By

Published : Jul 27, 2020, 3:36 PM IST

Updated : Jul 27, 2020, 4:05 PM IST

Rajasthan Governor
అసెంబ్లీ సమావేశాలకు రాజస్థాన్​ గవర్నర్​ అనుమతి

15:32 July 27

అసెంబ్లీ సమావేశాలకు రాజస్థాన్​ గవర్నర్​ అనుమతి

రాజస్థాన్​లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్న వేళ రాష్ట్ర​ గవర్నర్​ అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు అనుమతిచ్చారు. అయితే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి 21 రోజులు ముందుగా గహ్లోత్​ సర్కార్ నోటీసు ఇవ్వాలని రాజ్​భవన్​ సూచించింది.

సచిన్​ పైలట్​ రెబల్​గా మారడం రాజస్థాన్​ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. అనంతరం పైలట్​ను డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్​ పదవులను నుంచి తప్పించింది కాంగ్రెస్​. ఈ పరిణామాలతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అయితే తమ వద్ద మెజారిటీ ఉందని.. తమ బలాన్ని నిరూపించుకునేందుకు శాసనసభ నిర్వహించాలని అశోక్​ గహ్లోత్​ ప్రభుత్వం గవర్నర్​ను కోరుతోంది.

Last Updated :Jul 27, 2020, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.