ETV Bharat / bharat

ఇండియా ఐడియాస్​ సమిట్​లో నేడు ప్రధాని ప్రసంగం

author img

By

Published : Jul 22, 2020, 5:05 AM IST

Updated : Jul 22, 2020, 5:14 AM IST

PM Modi to deliver keynote address at India Ideas Summit on July 22
ఇండియా ఐడియాస్​ సమిట్​లో నేడు ప్రధాని ప్రసంగం

ఇండియా ఐడియాస్​ సమిట్​లో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక విషయాలపై ప్రసంగించనున్నారు. భారత్​-అమెరికా వాణిజ్య మండలి ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఇరు దేశాల సంబంధాలపై ఉన్నతస్థాయి అధికారుల మధ్య చర్చలు సాగనున్నాయి.

నేడు జరగనున్న ఇండియా ఐడియాస్​ సమిట్​లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. భారత్​-అమెరికా వాణిజ్య మండలి నిర్వహిస్తున్న ఈ సదస్సులో మోదీ పలు కీలక విషయాలను ప్రస్తావించే అవకాశముంది.

ఈ మండలిని స్థాపించి ఈ ఏడాదికి 45ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి.. 'మెరుగైన భవిష్యత్తు నిర్మాణం' అనే అంశాన్ని థీమ్​గా ఎంపిక చేసినట్టు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

వర్చువల్​ విధానంలో జరగనున్న ఈ భేటీలో భారత్​-అమెరికా విదేశాంగమంత్రులు జైశంకర్​, మైక్​ పాంపియోతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు, వాణిజ్య-సామాజిక నేతలు పాల్గొననున్నారు.

సదస్సులో భాగంగా భారత్​-అమెరికా సహకారం సహా కరోనా సంక్షోభం అనంతరం ఇరు దేశాల భవిష్యత్తు సంబంధాలపై అధికారులు చర్చించనున్నారు.

ఇదీ చూడండి:- 'భారత్​లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం'

Last Updated :Jul 22, 2020, 5:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.