ETV Bharat / bharat

ఎఫ్​ఏటీఎఫ్​ భేటీతో తీవ్ర ఒత్తిడిలో పాక్​: డోభాల్​

author img

By

Published : Oct 14, 2019, 1:30 PM IST

Updated : Oct 14, 2019, 5:32 PM IST

ఎఫ్​ఏటీఎఫ్​ భేటీతో తీవ్ర ఒత్తిడిలో పాక్​: డోభాల్​

పారిస్​ వేదికగా జరుగుతున్న ఎఫ్​ఏటీఎఫ్​ సమావేశంతో పాకిస్థాన్​ తీవ్ర ఒత్తిడిలో ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ తెలిపారు. పాక్​లో ఉగ్రకార్యకలాపాల నియంత్రణపై భేటీలో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.

ఎఫ్​ఏటీఎఫ్​ భేటీతో తీవ్ర ఒత్తిడిలో పాక్​: డోభాల్​

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్ అన్నారు. పారిస్​ వేదికగా అంతర్జాతీయ ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ(ఎఫ్​ఏటీఎఫ్​) సమావేశం కావడమే ఇందుకు కారణమని తెలిపారు. పాకిస్థాన్​లో ఉగ్రకార్యకలాపాల నియంత్రణకు చర్యలు చేపట్టే అంశంపై భేటీలో చర్చ జరుగుతోందన్నారు డోభాల్​.

దిల్లీలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్​), ప్రత్యేక కార్యాచరణ దళం(ఎస్​టీఎఫ్​) సారథుల జాతీయ సదస్సులో ప్రసంగించారు డోభాల్​.

"మనకు లభించిన ఆధారాలను సరైన సంస్థకు అందించాం. ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకోలేదు. వాస్తవాలు మారవు. మన భాధ్యత నిర్వర్తించాం. సరైన ప్రభావం ఉంటుంది. మన పోరాటం కొనసాగుతుంది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తోందని చెప్పొచ్చు. కానీ ఆధారాలేవి? ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందకు తీసుకోవాల్సిన చర్యలే ప్రధాన అంశంగా సమావేశం జరుగుతోంది. ఆ చర్యలు ఏంటనే విషయంపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది. "
-అజిత్ డోభాల్, జాతీయ భద్రతా సలహాదారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశమూ యుద్ధం చేసేందుకు సిద్ధంగా లేదన్నారు డోభాల్. తీవ్ర ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉన్నందు వల్ల అలాంటి సాహసం ఎవరూ చేయబోరని అభిప్రాయపడ్డారు.

ఉగ్రవాదాన్ని దేశ విధానాల్లో ఓ సాధనంగా పాకిస్థాన్​ వినియోగిస్తోందని విమర్శించారు డోభాల్​.

భారత్​లో 125 మంది జేఎంబీ అనుమానితులు

జమాత్​ ఉల్ ముజాహిదీన్​​ బంగ్లాదేశ్ (జేఎంబీ) సంస్థ భారత్​లో విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందని జాతీయ దర్యాప్తు సంస్థ సారథి​ వైసీ మోదీ తెలిపారు. ఝార్ఖండ్​, బిహార్​, మహారాష్ట్రలో, కర్ణాటక, కేరళలో ఆ సంస్థ కార్యకలాపాలు కొనగాతున్నాయని ఉగ్రవాద వ్యతిరేక బృందాల(ఏటీఎఎస్​) సారథుల జాతీయ సదస్సులో వెల్లడించారు.

జేఎంబీ నాయకత్వంతో సంబంధాలు కొనసాగిస్తూ ఆయా రాష్ట్రాల్లో 125 అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినట్లు తమ వద్ద సమాచారం ఉందని వైసీ మోదీ చెప్పారు.

ఇదీ చూడండి: ఆ డ్రోన్లు కనిపిస్తే ఇక కూల్చివేయడమే...!

AP Video Delivery Log - 0200 GMT News
Monday, 14 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0108: Ecuador Talks AP Clients Only 4234624
Ecuador's indigenous, president sit down for talks
AP-APTN-0009: Hungary Election 2 AP Clients Only 4234621
Opposition's Karacsony set for Budapest mayor win
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated :Oct 14, 2019, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.