ETV Bharat / bharat

గుడ్డు కూర పెట్టలేదని మిత్రుడి హత్య

author img

By

Published : Oct 18, 2020, 5:28 PM IST

Nagpur: Man kills friend for not making egg curry for dinner
గుడ్డుకూర లేదని ఆగ్రహంతో మిత్రుడ్ని హతమార్చిన వ్యక్తి!

మహారాష్ట్రలో అనూహ్య రీతిలో తన స్నేహితుడ్ని హత్య చేశాడో వ్యక్తి. పార్టీలో గుడ్డు కూర లేదని ఆగ్రహిస్తూ.. ఏకంగా మిత్రుడి ప్రాణం తీశాడు.

మహారాష్ట్ర నాగ్​పుర్​లో కోడి గుడ్డు కోసం ప్రాణానికి ప్రాణమైన మిత్రుడినే చంపేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ జరిగింది..

మాన్​కాపుర్​ ప్రాంతంలో బనారసి అనే వ్యక్తి విందు ఏర్పాటుచేసి.. మిత్రులను ఆహ్వానించాడు. బనారసి, గౌరవ్​ గైక్వాడ్ ఇద్దరూ కలిసి తాగుతూ అర్ధరాత్రి వరకు అలాగే కబుర్లు చెప్పుకున్నారు. మాటల మధ్యలో భోజనాల సందర్భం రాగా.. తనకు గుడ్డు కూర వండలేదని ఆగ్రహం వ్యక్తంచేశాడు అతిథిగా వచ్చిన గైక్వాడ్​. వాగ్వాదంలో బనారసిని ఇనుప రాడ్​తో కొట్టాడు​. తలపై తీవ్రగాయాలైన బనారసి అక్కడిక్కడే మృతిచెందాడు.

ఈ పూర్తి వ్యవహారంపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. నిందితుడు గైక్వాడ్​ను అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: 'దేశంలో కరోనా 2.0 రాదని చెప్పలేం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.