ETV Bharat / bharat

40రోజుల పసికందును గొంతు కోసి చంపిన తల్లి

author img

By

Published : Oct 9, 2020, 4:10 PM IST

Mother killed 40 day old girl child at Murshidabad in West Bengal
40రోజుల పసికందును కిరాతకంగా హతమార్చిన తల్లి!

తొమ్మిది నెలలు కడుపులో మోసిన కన్నతల్లే తన బిడ్డను పొట్టనపెట్టుకుంది. పెంచిపోషించాల్సిన ఆ అమ్మే.. కూతురి ప్రాణాలు తీసింది. ఊహ తెలియకముందే ప్రపంచానికే దూరం చేసింది. 40రోజుల ఓ పసికందును.. తల్లే అతి కిరాతకంగా హత్య చేసిన దారుణ ఘటన బంగాల్​లో జరిగింది.

బంగాల్​ ముర్షీదాబాద్​ జిల్లా బెర్హమ్​పుర్​లో అమానవీయ ఘటన జరిగింది. కన్న తల్లే 40రోజుల పసికందును గొంతుకోసి అతి కిరాతకంగా చంపింది. అనంతరం తప్పించుకునేందుకు యత్నించి, గ్రామస్థులకు దొరికిపోయింది.

Mother killed 40 day old girl child at Murshidabad in West Bengal
నిందితురాలు చైతాలి(పసుపు పచ్చని చీర)

నిందితురాలు చైతాలి మండల్​కు కొంతకాలంగా మతిస్థిమితం లేనట్టు తెలుస్తోంది. మరోసారి ఆడపిల్ల పుట్టినందుకే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని స్థానికులు చెప్పారు.

రెండేళ్ల క్రితం చైతాలి ఓ ఆడబిడ్డకు జన్మనివ్వగా అప్పుడే ఆ పాప చనిపోయిందట. ఆ తర్వాత మరోసారి కూతురే పుట్టింది. అప్పటి నుంచి చైతాలి మానసిక క్షోభకు గురువుతోందని స్థానికులు అంటున్నారు.

పోలీసులు చైతాలిని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: భార్య తల నరికి పోలీస్ స్టేషన్​కు పట్టుకెళ్లిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.