ETV Bharat / bharat

'మోదీ విధానాలు దేశానికి వినాశనకరం'

author img

By

Published : Jul 30, 2020, 2:33 PM IST

Modi's 'wrong' policies proved 'disastrous' for country: Raj CM
'మోదీ విధానాలు దేశానికి వినాశనకరం'

కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు రాజస్థాన్​ సీఎం అశోక్ గహ్లోత్​. ఈ మేరకు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ట్వీట్​ను తిరిగి పోస్ట్​ చేశారు గహ్లోత్​.

కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలతో దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆరోపించారు. నోట్ల రద్దు​, జీఎస్టీ వంటి అంశాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన పోస్ట్‌ను గహ్లోత్ ఈమేరకు​ ట్విట్టర్‌లో పోస్ట్​ చేశారు.

"ప్రధాని మోదీ ప్రభుత్వం తప్పుడు విధానాల కారణంగా దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కోంటోంది. రాహుల్‌ గాంధీ ఆరోపించినట్లు... నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, కరోనా వల్ల ఆర్థికవ్యవస్థ సంక్షోభంలోకి కూరుకుపోవడం, ఉద్యోగాలు కోల్పోవడం వంటి దుష్పరిణామాలను ఎదుర్కోవడంలో కేంద్రం విఫలమైంది."

- అశోక్​ గహ్లోత్​, రాజస్థాన్​ సీఎం

ఇదీ చూడండి: దిల్లీకి ఊరట- డీజిల్​పై వ్యాట్ భారీగా తగ్గింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.