భారత్ 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన దేశం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అంకెలు. ఇక నుంచి దేశ చిత్రపటంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల లెక్కలు మారనున్నాయి. జమ్ముకశ్మీర్ ను విభజిస్తూ ప్రధాని నరేంద్రమోదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇక నుంచి 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన భారతదేశం దర్శనమివ్వనుంది.
జమ్ముకశ్మీర్ రాష్ట్రం సర్కారు తాజా నిర్ణయంతో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా రూపాంతరం చెందనుంది. దిల్లీ, పుదుచ్చేరి తరహాలో జమ్ముకశ్మీర్... శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా మారనుంది. లద్ధాఖ్ ప్రాంతం మాత్రం చండీఘడ్లా అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఉండనుంది.
ఇదీ చూడండి:370, 35ఏ రద్దు... కశ్మీర్ ఇక అందరితో సమానమే