ETV Bharat / bharat

'అధిష్ఠానం క్షమిస్తే సచిన్​కు తిరిగి స్వాగతం పలుకుతా'

author img

By

Published : Aug 1, 2020, 6:17 PM IST

If high command forgives rebels, I will welcome them back: Gehlot
'అధిష్ఠానం క్షమిస్తే అసమ్మతి ఎమ్మేల్యను తిరిగి స్వాగతిస్తా'

అధిష్ఠానం క్షమిస్తే రాజస్థాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సచిన్ పైలట్​ వర్గం ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తానని చెప్పారు సీఎం అశోక్​ గహ్లోత్​. తమ ప్రభుత్వాన్ని కూల్చాలనే ప్రయత్నాలను ఆపాలని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి విమర్శించారు. ప్రలోభాల పర్వం మరీ పతాక స్థాయికి చేరిందని ఆరోపించారు.

రాజస్థాన్​లో రాజకీయ తమాషాను ప్రధాని నరేంద్ర మోదీయే ఆపాలన్నారు సీఎం అశోక్​ గహ్లెత్​. తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని కోరారు. కాంగ్రెస్​ అధిష్ఠానం క్షమిస్తే రాజస్థాన్​ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురేసిన సచిన్ పైలట్​ వర్గాన్ని తిరిగి పార్టీలోకి అహ్వానిస్తానని చెప్పారు గహ్లోత్​. తనకు మూడు సార్లు సీఎం అవకాశం ఇచ్చిన పార్టీ.. ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతమే అని స్పష్టం చేశారు.

రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తన మద్దతుదారుల మకాంను జైపుర్​లోని ఫెయిర్​మౌంట్​ హోటల్​ నుంచి జైసల్మేర్​లోని సూర్యగఢ్ రిసార్టుకు మార్చారు గహ్లోత్​. అక్కడే ఒకరోజు ఉండి తిరిగి జైపుర్ బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. మరోమారు పైలట్​పై విమర్శలు గుప్పించారు.

అసెంబ్లీ సమావేశాల తేదీలు ప్రకటించిన అనంతరం ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు నగదు ఆశను భారీగా పెంచారని ఆరోపించారు గహ్లెత్​. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ధ్వజమెత్తారు. కేంద్ర హోంశాఖ తన ప్రభుత్వంపైనే దృష్టి సారించిందన్నారు.

ఇదీ చూడండి: భాజపాలో సంస్థాగత మార్పులు- వారికే కీలక బాధ్యతలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.