ETV Bharat / bharat

'ఉగ్రవాద నిర్మూల చర్యల బలోపేతమే ప్రధాన అజెండా'

author img

By

Published : Jun 19, 2020, 5:22 AM IST

Enhancing counter terrorism
'ఉగ్రవాద నిర్మూల చర్యల బలోపేతమే ప్రధాన అజెండా'

ఐరాస భద్రత మండలిలో ఉగ్రవాద నిర్మూలన చర్యల బలోపేతం, ఆంక్షలపై రాజకీయ జోక్యం తగ్గించటం ప్రధాన అజెండాగా పేర్కొంది భారత్​. యూఎన్​ఎస్​సీకి ఎన్నికైన కొన్ని గొంటల్లోనే కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో ప్రతిపాదించిన ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు వెల్లడించింది.

ఐక్యరాజ్య సమితి భద్రత మండలికి ఎన్నికైన వేళ కీలక విషయాలు వెల్లడించింది భారత్​. యూఎన్​ఎస్​సీలో ఉగ్రవాద నిర్మూలన చర్యలను బలోపేతం చేయటం, తీవ్రవాద సంస్థలపై ఆంక్షలు విధించే అంశంపై రాజకీయాల ప్రభావం తగ్గించటం తమ ప్రాధాన్య అంశాలలో ప్రధానమైనవి స్పష్టం చేసింది. భద్రత మండలిలో ప్రాతినిధ్యం వహించని దేశాల గొంతుకని వినిపించేందుకు భారత్​ ఎదురుచూస్తోందని పేర్కొన్నారు విదేశాంగ శాఖ కార్యదర్శి వికాస్​ స్వరూప్​.

" యూఎన్​ఎస్​సీలో ఉగ్రవాద నిర్మూలన చర్యలను బలోపేతం చేయటం మా ప్రాధాన్యాంశాల్లో ఒకటి. గతంలో 2011-12లో భద్రత మండలిలో సభ్యులుగా ఉన్నప్పుడు.. తీవ్రవాద నిర్మూలన కమిటీకి అధ్యక్షత వహించాం. సభ్య దేశాల్లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిందేనన్న భావనను తీసుకొచ్చాం. 1996లో భారత్​ ప్రతిపాదించిన అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సును త్వరితగతంగా ఏర్పాటుకు కృషి చేస్తాం."

- వికాస్​ స్వరూప్​, విదేశాంగ శాఖ కార్యదర్శి.

అంతర్జాతీయ సంస్థల వేదికగా ద్వైపాక్షిక సమస్యలను పాకిస్థాన్​ ప్రతినిధి లేవనెత్తితే పరిస్థితి ఏంటి? అని అడిగిన ప్రశ్నకు.. గత కొన్నేళ్లుగా పాక్​ అదే విధంగా ప్రవర్తిస్తోందని సమాధానమిచ్చారు స్వరూప్​. బహుపాక్షిక సంస్థల వేదికగా ద్వైపాక్షిక సమస్యలను లేవనెత్తుతూ వస్తోందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంస్కరించిన బహుపాక్షికత, విదేశాంగ విధానంలోని 5ఎస్​ ( సమ్మాన్​ (గౌరవం), సంవాద్​ (చర్చలు), సయ్యోగ్​(సహకారం), శాంతి, , సార్వత్రిక సమృద్ధి) వ్యూహాలతో ఐరాస భద్రత మండలిలో భారత్​ పని చేస్తుందని తెలిపారు.

ఇదీ చూడండి: చైనా వ్యూహమేంటి? గల్వాన్​ ఘటనతో లక్ష్యం నెరవేరిందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.