ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు ముష్కరులు హతం

author img

By

Published : Jan 31, 2020, 8:36 AM IST

Updated : Feb 28, 2020, 3:13 PM IST

encounter at jammu-srinagar highway
జమ్ము-శ్రీనగర్​ హైవేపై ఎన్​కౌంటర్​.

జమ్ము-శ్రీనగర్​ హైవేపై ఈరోజు ఉదయం ఎన్​కౌంటర్ జరిగింది. ఓ ట్రక్కులో వెళ్తున్న ఉగ్రవాదులు టోల్​ప్లాజా వద్ద పోలీసులను చూసి కాల్పులకు తెగబట్టారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతమయ్యారు.

జమ్ముకశ్మీర్​లో ఈరోజు ఉదయం 5గంటలకు ఎన్​కౌంటర్​ జరిగింది. జమ్ము-శ్రీనగర్ హైవేపై ఓ ట్రక్కులో శ్రీనగర్ వెళ్తున్న ఉగ్రవాదులు నగ్రోటాలో ప్రాంతంలోని టోల్​ప్లాజా వద్ద పోలీసులను చూసి కాల్పులకు తెగబడ్డారు. ప్రతిఘటించిన బలగాలు ఎదురుకాల్పులు జరపగా ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. ఓ పోలీసు గాయపడినట్లు చెప్పారు. ఘటనాస్థలం నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

భద్రతా కారణాల దృష్ట్యా హైవేపై రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. నగ్రోటా ప్రాంత పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

జమ్ము-శ్రీనగర్​ హైవేపై ఎన్​కౌంటర్
Intro:Body:

dd


Conclusion:
Last Updated :Feb 28, 2020, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.