ETV Bharat / bharat

'రైతుల ఆదాయం రెట్టింపు చేయటమే ప్రభుత్వ లక్ష్యం'

author img

By

Published : Jan 17, 2021, 4:35 PM IST

Doubling farmers income biggest priority of Modi govt: Amit Shah
'రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే మోదీ కర్తవ్యం'

మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల సంక్షేమానికే పెద్దపీట వేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా తెలిపారు. అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికే మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని హోం మంత్రి అమిత్​ షా అన్నారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలు అందుకు తోడ్పడతాయని చెప్పారు.

కర్ణాటకలోని బాగల్​కోట్​లో ఆ రాష్ట్ర మంత్రి మురుగేశ్ ఆర్​ నిరానీకి చెందిన ఎంఆర్​ఎన్​ గ్రూప్​ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన అనంతరం.. రైతుల సంక్షేమం కోసం కేంద్రం అహర్నిశలు పనిచేస్తోందని కొనియాడారు షా. రాష్ట్రంలోనూ సీఎం యడియూరప్ప కూడా రైతుల మేలుచేసే ఏ ఒక్క అవకాశాన్నీ వదలేట్లదని చెప్పారు. అందులో భాగంగానే కొత్త వ్యవసాయ చట్టాలకు కర్ణాటక సర్కార్​ మద్దతు పలికిందని స్పష్టం చేశారు. ఈ విషయంలో యడియూరప్పకు అభినందనలు తెలిపారు మంత్రి.

కాంగ్రెస్​పై విమర్శలు..

కాంగ్రెస్​ ఉద్దేశాలు సరిగ్గా లేవని ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు షా. కాంగ్రెస్​ హయాంలో రైతులకు రూ.6,000 నగదు సహకారం అందించడం, ప్రధాన్​ మంత్రి ఫసల్​ బీమా యోజన వంటి పథకాలను ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. గత 70ఏళ్లుగా పెండింగ్​లో ఉండి, ఏ ప్రభుత్వానికి సాధ్యం కాని కశ్మీర్​ అంశాన్ని కూడా తమ ప్రభుత్వం శాంతియుతంగా పరిష్కరించగలిగిందని గుర్తు చేశారు.

ఇదీ చదవండి: ఏకాంత చిత్రాలు.. వీడియోలతో భర్త వేధింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.