ETV Bharat / bharat

'ఎవరేం చేసినా పౌర చట్టంపై వెనకడుగు ప్రసక్తే లేదు'

author img

By

Published : Jan 21, 2020, 3:16 PM IST

Updated : Feb 17, 2020, 9:05 PM IST

amith sha
అమిత్​షా

పౌర చట్టంపై విపక్షాలు దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్​షా. సీఏఏకు వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు చేపట్టినా ఉపసంహరణ కుదరదన్నారు. పౌరచట్ట అనుకూల ప్రచారంలో భాగంగా ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లఖ్​నవూలో నిర్వహించిన బహిరంగసభలో అమిత్​షా ప్రసంగించారు.

ఎన్ని ఆందోళనలు చేపట్టినా పౌరచట్టంపై వెనక్కి తగ్గేది లేదన్నారు భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్​షా. పౌరచట్టానికి మద్దతుగా ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లఖ్​నవూలో జన్​జాగరణ్​ అభియాన్​ పేరిట నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు షా. ధైర్యముంటే సీఏఏపై బహిరంగ చర్చకు రావాలని విపక్షాలకు సవాల్ విసిరారు.

పౌరచట్టంతో ఎవరి పౌరసత్వాన్ని తొలగించబోమని పునరుద్ఘాటించారు భాజపా అగ్రనేత. ఓటుబ్యాంకు రాజకీయాలతో కాంగ్రెస్ కళ్లు మూసుకుపోయాయని , వాస్తవాలు గ్రహించడం లేదన్నారు.

అమిత్​షా

"పౌరచట్టానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఆయన అనుచరులు, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, మాయవతి అంతా కలిసి ఆరోపణలు చేస్తున్నారు. నేను ఉత్తర్​ప్రదేశ్​ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు వచ్చాను. పౌరచట్టం కారణంగా ముస్లిం ప్రజలు, మైనారిటీల పౌరసత్వం ప్రమాదంలో పడుతుందని ఆరోపిస్తున్నారు. ఈ బిల్లును నేనే సభలో ప్రవేశపెట్టాను. విపక్షనేతలూ.. మీకు ధైర్యముంటే ఓ ఉమ్మడి వేదిక చూపెట్టండి. సీఏఏపై చర్చిద్దాం. పౌరచట్టం ద్వారా ఎవరి పౌరసత్వమైనా రద్దయితే అది నాకు చూపండి."

-అమిత్​షా, కేంద్ర హోంమంత్రి

'ఆకాశాన్నంటే మందిరం'

అయోధ్యలో రామమందిర నిర్మాణంపై స్పష్టత ఇచ్చారు అమిత్​షా. మూడు నెలల్లో ఆకాశాన్నంటే మందిర నిర్మాణాన్ని రామ జన్మభూమిలో మొదలు పెడతామన్నారు.

ఇదీ చూడండి: 'ఆపరేషన్​ కశ్మీర్'​లో కేంద్రం తదుపరి వ్యూహం ఏంటి?

Intro:Body:Conclusion:
Last Updated :Feb 17, 2020, 9:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.