కలిసిన నాలుగు గంటలోనే పెళ్లి చేసుకొన్నారు బంగాల్ రాష్ట్రం హుగ్లీకి చెందిన యువతీ యువకులు. ఓ అంతర్జాతీయ వ్యాపారసంస్థలో పనిచేస్తున్న సుదీప్ ఘోషల్కు, ప్రీతమాతో ఈ తొలిచూపు అనంతర వివాహం జరిగింది.
ఇదీ జరిగిందీ...
సుదీప్, ప్రీతమా మధ్య ఫేస్బుక్ వేదికగా ఇటీవల స్నేహం కుదిరింది. కానీ.. ఒక్కసారి కూడా కలుసుకోలేదు. నవరాత్రి ఉత్సవాల్లో కలుద్దామని సంక్షిప్త సందేశాలు పంపించుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం దుర్గాష్టమి రోజు దుర్గా దేవి మండపంలో కలిశారు. కలిసిన కొంత సమయానికే తక్షణమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నాలుగు గంటల్లోనే మాలలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు.
ప్రీతమా నుదుట సింధూరం పెట్టాడు సుదీప్. ఇంకేముంది.. కుమారిగా కలిసేందుకు వెళ్లిన ప్రీతమా శ్రీమతిగా అత్తారింట అడుగు పెట్టింది.
సంబంధాలు చూసే బాధ లేకుండానే, అందమైన కోడలు వచ్చినందుకు ప్రీతమా అత్త, సుదీప్ తల్లి మురిసిపోతోంది.