ETV Bharat / bharat

ఈ నెల 12 నుంచి కాంగ్రెస్​ 'గాంధీ సందేశ్​ యాత్ర'

author img

By

Published : Mar 7, 2020, 8:27 PM IST

Congress to take out Gandhi Sandesh Yatra from Mar 12
సోనియా, రాహుల్​ గాంధీ 386 కిలోమీటర్ల పాదయాత్ర!

సంపూర్ణ స్వరాజ్యం కోసం.. బ్రిటీష్​ వారికి వ్యతిరేకంగా ఆనాడు మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం చేశారు. ఉప్పుపై పన్నును నిరాకరిస్తూ 1930 మార్చి 12న దండీమార్చ్​ చేపట్టారు. సబర్మతీ ఆశ్రమం నుంచి దండీ వరకు సాగిన ఈ యాత్రలో వేలమంది భారతీయులు పాల్గొన్నారు. మరోమారు ఆ దండీ యాత్రను గుర్తుచేస్తూ.. సబర్మతీ ఆశ్రమం నుంచి దండీ వరకు పాదయాత్ర చేపట్టనుంది కాంగ్రెస్​ పార్టీ. 'గాంధీ సందేశ్​ యాత్ర' పేరుతో మొత్తం 27 రోజులు సాగే ఈ యాత్ర ఈనెల 12న మొదలవుతుంది.

మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఈనెల 12 నుంచి 'గాంధీ సందేశ్​ యాత్ర'కు శ్రీకారం చుట్టనుంది కాంగ్రెస్​ పార్టీ. ఈ పాదయాత్రతో గాంధీ 150వ జయంతితో పాటు దండీమార్చ్​ను కూడా స్మరించుకోనుంది. 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్​ 6 వరకు సాగిన దండీమార్చ్​కు ఈనెల 12తో 90 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా అహ్మదాబాద్​- సబర్మతీ ఆశ్రమం నుంచి దండీ వరకు (386 కిలోమీటర్లు) మొత్తం 27 రోజులపాటు ఈ పాదయాత్ర సాగనుంది.

కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ నాయకులు రాహుల్​ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలతో సహా పలువురు నేతలు ఈ యాత్రలో పాల్గొననున్నారు.

గాంధీ సందేశ్​ యాత్ర ముగింపు సందర్భంగా దండీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. సోనియా, రాహుల్​తో పాటు కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ​ అధ్యక్షులు, సీడబ్ల్యూసీ సభ్యులు ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు.

గాంధీ స్ఫూర్తిని తిరిగి పొందడమే లక్ష్యం

దండీమార్చ్​లో గాంధీ నింపిన స్ఫూర్తిని ఈ యాత్ర ద్వారా తిరిగి పొందడమే తమ ఉద్దేశమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

ఇదీ చదవండి: ఆఫీసులు, స్కూళ్లు, యూనివర్శిటీల్లో ఇక అవి బంద్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.