ETV Bharat / bharat

పుల్వామాలో పౌరుడ్ని కాల్చి చంపిన ముష్కరులు

author img

By

Published : Aug 16, 2020, 5:06 AM IST

Civilian shot dead by militants in Pulwama
పుల్వమాలో పౌరుడ్ని కాల్చి చంపిన ముష్కరులు

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో ఓ సాధారణ పౌరుడి ప్రాణాలు బలిగొన్నారు ముష్కరులు. తన నివాసంలోనే తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి హతమార్చారు. ఉగ్రవాదులు పౌరడ్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారనే విషయంపై ఎలాంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు.

జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లా దదూరా-కంగన్ ప్రాంతంలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ పౌరుడి ఇంటిపై దాడి చేసి తుపాకులతో కాల్చి చంపారు. శనివారం రాత్రి 9:40 గంటలకు ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తి పేరు అజాద్ అహ్మద్​ దార్​ అని వెల్లడించారు.

అయితే ఉగ్రవాదాలు పౌరుడ్ని లక్ష్యంగా చేసుకుని ఎందుకు దాడి చేశారనే విషయం తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు.

ఇదీ చూడండి: ఎర్రకోట వద్ద లేజర్‌ కళ్ల నిఘా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.