ETV Bharat / bharat

పుల్వామాలో ముగ్గురు ఉగ్రవాద సహాయకులు అరెస్ట్​

author img

By

Published : Mar 9, 2020, 8:16 PM IST

Updated : Mar 9, 2020, 11:40 PM IST

3 militant associates of Hizbul Mujahideen arrested in Pulwama
పుల్వామాలో ముగ్గురు ఉగ్రవాద సహాయకులు అరెస్ట్​

పుల్వామాలో ముగ్గురు ఉగ్రవాద అనుచరులు అరెస్టయ్యారు. హిజ్బుల్ ముజాహిదీన్​కు చెందిన తీవ్రవాదులకు వీరు సాయం చేస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. వీరు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పుల్వామాలో ముగ్గురు ఉగ్రవాద సహాయకులు అరెస్ట్​

కశ్మీర్​- పుల్వామాలో హిజ్బుల్​ ముజాహిదీన్​కు చెందిన ముగ్గురు ఉగ్రవాద అనుచరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉగ్రవాదులకు సాయమందిస్తున్న ఈ ముగ్గురినీ.. దక్షిణ కశ్మీర్​ జిల్లా అవంతిపురలో అరెస్ట్​ చేశారు.

అరెస్టయిన వారిని ఆదిల్​ రసూల్​, రియాజ్​ అహ్మద్​, మహ్మద్​ ఇసాక్​ భట్​గా గుర్తించారు పోలీసులు. ఈ ముగ్గురూ త్రాల్​ ప్రాంతంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ.. వారి కార్యకలాపాలకు సాయపడుతున్నారని అధికారులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: దిల్లీ అల్లర్లపై కాంగ్రెస్​ నిజనిర్ధరణ కమిటీ నివేదిక

Last Updated :Mar 9, 2020, 11:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.