కశ్మీర్- పుల్వామాలో హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన ముగ్గురు ఉగ్రవాద అనుచరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉగ్రవాదులకు సాయమందిస్తున్న ఈ ముగ్గురినీ.. దక్షిణ కశ్మీర్ జిల్లా అవంతిపురలో అరెస్ట్ చేశారు.
అరెస్టయిన వారిని ఆదిల్ రసూల్, రియాజ్ అహ్మద్, మహ్మద్ ఇసాక్ భట్గా గుర్తించారు పోలీసులు. ఈ ముగ్గురూ త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ.. వారి కార్యకలాపాలకు సాయపడుతున్నారని అధికారులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: దిల్లీ అల్లర్లపై కాంగ్రెస్ నిజనిర్ధరణ కమిటీ నివేదిక