ETV Bharat / bharat

ఇద్దరు బీఎస్​ఎఫ్​ సిబ్బంది మృతి.. కొత్తగా 41 కేసులు

author img

By

Published : May 7, 2020, 4:54 PM IST

2 BSF personnel die of COVID-19; 41 news cases reported
ఇద్దరు బీఎస్​ఎఫ్​ సిబ్బంది మృతి.. కొత్తగా 41 కేసులు

సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​)లో కొవిడ్​ ధాటికి ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఈ కేంద్ర బలగాలకు చెందిన మరో 41 మందికి కరోనా పాజిటివ్​గా​ నిర్ధరణ అయింది.

సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​)లో కరోనాతో ఇద్దరు సిబ్బంది మృతిచెందారు. అంతకంతకూ విస్తరిస్తోన్న మహమ్మారి.. నేడు ఈ కేంద్ర బలగాలకు చెందిన మరో 41 మందికి ​ సోకింది. దీంతో బీఎస్​ఎఫ్​ దళంలో మొత్తం కొవిడ్​ బాధితుల సంఖ్య 193కు పెరిగింది. ఇద్దరు జవాన్లు వైరస్​ నుంచి కోలుకున్నారని ఓ సీనియర్​ అధికారి తెలిపారు.

కరోనా మృతుల్లో బీఎస్​ఎఫ్​లో ఇదే మొదటికేసు కాగా.. పారామిలిటరీ దళాల్లో రెండోది. సీఆర్​పీఎఫ్​లోని 55 ఏళ్ల ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఇటీవల‌ మృతిచెందాడు.

ఇదీ చదవండి: ఆపరేషన్​ సముద్ర సేతు: మాల్దీవులకు 'ఐఎన్​ఎస్​ జలాశ్వ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.