ETV Bharat / bharat

'బంగాల్, అసోం తొలి విడతలో భాజపాకే పట్టం'

author img

By

Published : Mar 28, 2021, 2:46 PM IST

Updated : Mar 28, 2021, 3:12 PM IST

amit shah thanks bengal, assam voters
బంగాల్, అసోం ఓటర్లకు ధన్యవాదాలు: షా

బంగాల్​, అసోం తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారీగా ఓటింగ్​లో పాల్గొన్న రెండు రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు భాజపాకే పట్టం గట్టారని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు.

శనివారం జరిగిన అసోం, బంగాల్​ తొలి విడత ఎన్నికల్లో ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగలేదని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బంగాల్​లో​ చాలా ఏళ్ల తర్వాత పోలింగ్ ప్రశాంతంగా సాగిందని చెప్పారు. ఘర్షణల వల్ల ఎక్కడా ఒక్కరూ కూడా చనిపోలేదని వివరించారు. భారీ సంఖ్యలో ఓటింగ్​లో పాల్గొన్న రెండు రాష్ట్రాల ప్రజలకు దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ధన్యవాదాలు తెలియజేశారు.

ఎన్నికల అనంతరం భాజపా నేతలు, బూత్​ స్థాయి కార్యకర్తలతో చర్చలు జరిపినట్లు షా చెప్పారు. తొలి విడతలో బంగాల్​లో 30 స్థానాలకు 26 చోట్ల భాజపానే గెలుస్తుందనే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. అసోంలోనూ 47 స్థానాలకు 37 సీట్లకు పైగా భాజపానే కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 8 విడతల ఎన్నికల అనంతరం బంగాల్​లో మొత్తం 200 స్థానాలకు పైగా గెలిచి భాజపా అధికారం దక్కించుకుంటుందని షా ఉద్ఘాటించారు.

పవార్​తో భేటీపై

ఎన్సీపీ అధినేత శరద్​పవార్​తో అహ్మదాబాద్​లో సమావేశమయ్యారని వస్తున్న వార్తలపైనా షా స్పందించారు. ప్రతి విషయాన్ని బహిరంగంగా వెల్లడించలేమని బదులిచ్చారు.

కేరళ గోల్డ్ స్కాంపై

కేరళ బంగారం అక్రమ రావాణా కుంభకోణం కేసులో కేంద్ర సంస్థల దర్యాప్తుపై న్యాయవిచారణ జరిపించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపైనా షా స్పందించారు. అప్రతిష్ఠ పాలు కాకుండా ఉండేందుకు కేరళ సర్కార్​ అంతకన్నా ఇంకేం చేయగలదని ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి: 'కేరళ ప్రభుత్వ​ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం'

Last Updated :Mar 28, 2021, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.