ETV Bharat / bharat

'ఆధార్​' చూపిన మార్గం- 10 ఏళ్ల తర్వాత ఇంటికి!

author img

By

Published : Jul 11, 2021, 9:51 AM IST

Updated : Jul 12, 2021, 9:39 PM IST

Aadhaar helps reunite with family
బాలున్ని కుటుంబానికి కలిపిన ఆధార్​

ఆధార్ నమోదు(Aadhaar card).. పదేళ్ల క్రితం తప్పిపోయిన ఓ దివ్యాంగ యువకుడు తన తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. అతని జీవితానికి ఆధారంగా నిలిచింది. అసలు ఆ వ్యక్తి ఎలా తప్పిపోయాడు? ఇన్నాళ్లు ఎక్కడున్నాడు?

మానసిక రుగ్మతతో బాధపడుతోన్న ఓ దివ్యాంగ యువకుడికి ఆధార్​ కార్డు(Aadhaar card) ఆధారంగా నిలిచింది. 10 ఏళ్ల తర్వాత తన తల్లిదండ్రులను చేరేందుకు సాయపడింది. మధ్యప్రదేశ్​లోని తన ఇంటి నుంచి తప్పిపోయి మహారాష్ట్ర చేరిన ఆ యువకుడి ఆధార్​ కార్డుతో గుర్తించగలిగారు అతడ్ని చేరదీన వ్యక్తి.

Aadhaar helps reunite with family
కుటుంబసభ్యులతో అమిర్
Aadhaar helps reunite with family
తల్లిదండ్రులతో అమిర్
Aadhaar helps reunite with family
కుటుంబ సభ్యులతో అమిర్
Aadhaar helps reunite with family
అమిర్ రాకతో..
Aadhaar helps reunite with family
కుటుంబసభ్యులతో అమిర్

ఇదీ జరిగింది..

2011లో మహారాష్ట్రలోని నాగ్​పుర్​ రైల్వే స్టేషన్​లో మతిస్థిమితం సరిగా లేని ఓ బాలుడిని పోలీసులు గుర్తించి.. అనాథాశ్రమంలో చేర్పించారు. అయితే.. 2015లో ఆ ఆశ్రమాన్ని మూసివేశారు. దాంతో ఆ బాలుడిని దామ్లే అనే వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లాడు. తన పిల్లలతో సమానంగా చూసుకునేవాడు. పాఠశాలలో చేర్పించాడు.

Aadhaar helps reunite with family
10 ఏళ్ల తర్వాత ఇంటికి
Aadhaar helps reunite with family
కేక్ కట్ చేస్తున్న అమిర్

"బాలుడు సరిగా మాట్లాడలేడని గుర్తించాను. నా దగ్గరకు వచ్చినప్పుడు కేవలం అమ్మా.. అమ్మా అంటూ తిరిగేవాడు. అతనికి అమన్​ అనే పేరు పెట్టాను. 2015లో అనాథాశ్రమం మూసివేయాల్సి వచ్చింది. అమన్​ని చూసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. నేనే నా కుటుంబ సభ్యునిగా చూసుకుంటున్నాను. నాకు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు."

-దామ్లే, అనాథాశ్రమ నిర్వహకుడు

ఆధార్ అధారంగా..

ఈ ఏడాది ఆ యువకుడు పదవ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం అతని వయసు 18 ఏళ్లు. స్కూలులో ఆధార్​ నెంబర్​ కావాలని అడిగారు ఉపాధ్యాయులు. దీంతో ఆధార్​ నమోదుకు దామ్లే ప్రయత్నించగా.. అతని వేలిముద్రలతో ఇప్పటికే ఆధార్​ నమోదు చేసినట్లు తెలిసింది. పలుమార్లు ప్రయత్నించిన అనంతరం నాగ్​పుర్​లోని యూఐడీఏఐ కార్యాలయాన్ని సంప్రదించాడు దామ్లే. దీంతో అధికారుల చొరవతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​లో ఇప్పటికే ఆధార్​ నమోదు చేసినట్లు తేలింది.

అతని పేరు మహమ్మద్​ అమిర్​గా గుర్తించారు. జబల్​పుర్​లో ఉన్న అధికారుల సహాయంతో అమిర్​ తల్లితండ్రులు హనుమంతల్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలుసుకున్నారు. అనంతరం అమిర్​ను వారికి అప్పగించారు.

తప్పిపోయిన తమ కొడుకు తిరిగి రావటం పట్ల అమిర్​ తల్లితండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:దేశంలోనే పొట్టి లాయర్​- వయసు 24, ఎత్తు 3 అడుగులు

ఒంటెలపై ప్రయాణిస్తున్న ఉపాధ్యాయులు.. ఎందుకంటే?

Last Updated :Jul 12, 2021, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.