ETV Bharat / bharat

బిహార్​లో ఘోర రోడ్డు ప్రమాదం- 8మంది మృతి

author img

By

Published : Feb 23, 2021, 6:54 AM IST

Updated : Feb 23, 2021, 7:54 AM IST

8-killed-in-bihar-road-accident
బిహార్​లో ఘోర రోడ్డు ప్రమాదం- 8మంది మృతి

06:53 February 23

బిహార్​లో ఘోర రోడ్డు ప్రమాదం- 8మంది మృతి

బిహార్​లో ఘోర రోడ్డు ప్రమాదం

బిహార్​ కటిహార్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుర్సిలా ప్రాంతంలో ట్రక్కు- కారు ఢీకొనడం వల్ల 8మంది మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సాదర్​ ఆసుపత్రికి తరలించారు.  

డ్రైవర్​ తప్పిదమేనా?

ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. మృతులతో పాటు గాయపడిన వారు బంగాల్​వాసులని సమాచారం. బంగాల్​లో వివాహ వేడుకకు హాజరై..  తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రమాదం జరిగిన గంటల పాటు.. గాయపడినవారు స్కార్పియోలోనే చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. కారు డ్రైవర్​ నిద్రలోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని సమాచారం.

Last Updated :Feb 23, 2021, 7:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.