ETV Bharat / bharat

'మహా'లో ఆగని ఉద్ధృతి.. కొత్తగా 62వేల కేసులు

author img

By

Published : Apr 30, 2021, 9:58 PM IST

Updated : Apr 30, 2021, 10:40 PM IST

corona
Maharashtra corona cases

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. మహారాష్ట్రలో శుక్రవారం ఒక్కరోజే 62,919 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కరోనాతో మరో 828 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ఒక్కరోజే 48,296 కరోనా కేసులు వెలుగు చూశాయి.

దేశంలో కొవిడ్​ కల్లోలం కొనసాగుతోంది. మహారాష్ట్రలో శుక్రవారం ఒక్కరోజే 62,919 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కరోనాతో మరో 828 మంది మరణించారు. ఒక్క ముంబయి నగరంలోనే..3,925 మందికి కరోనా సోకినట్లు తేలింది. కొవిడ్​ కారణంగా మరో 89 మంది మరణించారు. నాగ్​పుర్​ జిల్లాలో కొత్తగా 6,461 మందికి వైరస్​ సోకగా.. మరో 88 మంది మరణించారు.

కర్ణాటకలో కొత్తగా 48,296 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్​ ధాటికి మరో 217 మంది మృతి చెందారు.

ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు

రాష్ట్రంతాజా కేసులుతాజా మరణాలు
కేరళ37,199 49
గుజరాత్​14,605 173
తమిళనాడు 18,692 113
రాజస్థాన్17,155 155
మధ్యప్రదేశ్​12,400 97
ఉత్తర్​ప్రదేశ్​34,626332
బంగాల్​17,41196

ఇదీ చూడండి: కరోనాపై భయాలొద్దు.. ఇవి తెలుసుకోండి

ఇదీ చూడండి: 'ఆ రాష్ట్రాల్లో ఐదు రెట్ల వేగంతో కొవిడ్​ 2.0 వ్యాప్తి'

Last Updated :Apr 30, 2021, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.