ASANI: రాష్ట్రంలో 'అసని' బీభత్సం... అప్రమత్తమైన అధికారులు

By

Published : May 9, 2022, 1:48 PM IST

thumbnail

ASANI: అసని తుపాను కారణంగా రాష్ట్రంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీని ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికొచ్చిన పంట నేలరాలడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈదురుగాలుల తీవ్రతతో భారీ వృక్షాలు కూకటివేళ్లతో సహా నేలకూలిపోతున్నాయి. రోడ్లమీద విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో ట్రాఫిక్​కు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. రాష్ట్రంలో చాలా చోట్ల బొప్పాయి తోటలు, పొలాల్లో వరి కంకులు నేలరాలాయి. మరో 24 గంటలు దీని ప్రభావం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్రంలో మృత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.