వైఎస్సార్సీపీ మూకల ఆగడాలకు అంతే లేదు- ఎన్నికలు వస్తే దాడులకు తెగబడటం పరిపాటి: మంజుల - TDP Agent Manjula Interview

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 14, 2024, 5:57 PM IST

thumbnail
వైఎస్సార్సీపీ మూకల ఆగడాలకు అంతే లేదు- ఎన్నికలు వస్తే దాడులకు తెగబడటం పరిపాటి: మంజుల (ETV Bharat)

TDP Agent Manjula Interview on YSRCP Leaders Attacks: మాచర్లలో వైఎస్సార్సీపీ మూకల ఆగడాలకు అంతే లేకుండా పోయిందని సోమవారం పోలింగ్ సందర్భంగా గొడ్డలి దాడిలో గాయపడిన తెలుగుదేశం కార్యకర్త మంజుల అన్నారు. ఎన్నికలు వస్తే దాడులకు తెగబడటం వాళ్లకు అలవాటైపోయిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను ఓట్లు కూడా వేయనీయకుండా అడ్డుకుంటున్న ఇలాంటి కిరాతకుల ఆట కట్టించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ అనాగరికుల చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూనే ఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. 

కాగా మాచర్ల నియోజకవర్గంలో రెంటచింతల మండలం రెంటాలలో మంజుల భర్త కోటిరెడ్డి టీడీపీ నాయకుడిగా ఉన్నారు. కోటిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవటాన్ని సహించలేక వైఎస్సార్సీపీ నేతలు దాడి చేశారు. మహిళ అని కూడా చూడకుండా విచక్షణారహితంగా టీడీపీ కార్యకర్త మంజులపై గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. అక్కడి పరిస్థితి చూశాక తాను అసలు ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదన్నారు. ప్రస్తుతం గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంజులతో మా ప్రతినిధి చంద్రశేఖర్‌ ప్రత్యేక ముఖాముఖి మీకోసం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.