YCP Corporators Meet SP: లేడీ కానిస్టేబుల్​ను బలి చేయడానికి ముమ్మరయత్నాలు.. ఎస్పీను కలిసిన వైసీపీ కార్పొరేటర్లు..

By

Published : Aug 13, 2023, 1:16 PM IST

thumbnail

YCP Corporator Huchul In SEB police Station: అనంతపురం జిల్లాలో సెబ్ పోలీస్ స్టేషన్​పై వైసీపీ నాయకులు దాడి చేసిన ఘటనలో బాధితురాలైన మహిళా కానిస్టేబుల్​ను బలి చేయడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానిస్టేబుల్ రాధమ్మ ఫిర్యాదులో దాడి చేసిన వారి వివరాలను పొందుపరిచినా.. అధికార పార్టీ నాయకులు, పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో వారిని కేసు నుంచి తప్పించారు. కేసును ఉపసంహరించుకోవాలని రాధమ్మకు ఓ రాజకీయ పార్టీని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు వేధింపులకు గురిచేస్తున్నారు. అయితే ఈ క్రమంలో శనివారం ఎస్పీని కలిసి లేడీ కానిస్టేబుల్​పై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు కోరారు. దీంతో పక్కా వ్యూహంతోనే అధికార పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. లేడీ కానిస్టేబుల్​పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ దీనిపై పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.