TDP Leaders Fires on Police Cases: "యువగళం పాదయాత్రలో ఉన్నవారిపై.. అంగళ్లు ఘటనలో రాళ్లు వేశారని కేసా"

By

Published : Aug 14, 2023, 2:17 PM IST

thumbnail

TDP Leaders Fires on Angallu Punganur Police Cases: అంగళ్లు, పుంగనూరు ఘటనల్లో తెలుగుదేశం శ్రేణులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస విచారణ చేపట్టకుండా.. ఎఫ్​ఐర్​లో పేర్లు చేర్చడం పట్ల పార్టీ నేతలు మండిపడుతున్నారు. అమెరికాలో ఉన్న వ్యక్తి పేరును పుంగనూరు కేసులో పెట్టిన పోలీసులు.. ఇప్పుడు యువగళం పాదయాత్రలో ఉన్నవారిపై అంగళ్లు ఘటనలో కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. లోకేశ్​ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర ప్రారంభం నుంచి ఫుడ్ కో ఆర్డినేటర్​గా పని చేస్తున్న అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్య ప్రకాశ్​పై పోలీసులు.. అంగళ్లులో జరిగిన అల్లర్లలో కేసు నమోదు చేశారన్నారు. అసలు ఘటన సమయంలో అక్కడ లేని వ్యక్తిపై ఎలా కేసు పెడతారని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. యువగళం పాదయాత్రలో ఉన్న సూర్య ప్రకాశ్​..  అంగళ్లు వెళ్లి రాళ్లు వేశారని కేసు పెట్టడం పోలీసుల స్వామి భక్తికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. ఇలాంటి అక్రమ కేసులతో.. ప్రజలలో పోలీసు వ్యవస్థపై నమ్మకం పోతుందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.