నూతన సంవత్సర వేడుకల్లో ఇరువర్గాల మద్య ఘర్షణ, ఒకరు మృతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 1, 2024, 4:14 PM IST

thumbnail

One Person Died Due to Old Factions : నంద్యాల జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. డోన్​ మండలం ఉంగరానిగుండ్లలో పాతకక్షలతో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. నూతన సంవత్సర వేడుకలను చేసుకోవడానికి లక్ష్మీనారాయణ కుమారుడు కావలి ఖాదర్​ స్వగ్రామానికి వచ్చారు. వైసీపీకి చెందిన చిన్నమద్ది కుమారుడు ఓబులేష్​ పాతకక్షల నేపథ్యంలో ఖాదర్​పై దాడి చేశారు. అనంతరం ఖాదర్​ ఇంటికి వెళ్లి కర్రలతో కొట్టారు. ఈ దాడిలో ఖాదర్​ మృతి చెందారు.

Khader Died in Nandhyala District : వైసీపీ వర్గానికి చేసిన దాడిలో ఖాదర్​ మరణించగా, అతని సమీప బంధువులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మృతుని బంధువులు డోన్​ గ్రామీణ పోలీస్ స్టేషన్​ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. పోలీసులు స్పందిచకపోవడం వల్ల జాతీయ రహదారిపై రెండు గంటల పాటు బైఠాయించారు. డీఎస్పీ శ్రీనివాస రెడ్డి జోక్యం చేసుకుని బాధితులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అన్యాయంగా ఖాదర్​పై దాడి చేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కార్ల అద్దాలను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలకు దిక్కెవరని ఖాదర్​ భార్య, బంధువులు బోరున విలపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.